గద్వాల, ఏప్రిల్ 9 : పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడులు చేసిన కాల్వలు నేడు వట్టిపోయి కళావిహీనంగా మారాయి. వానాకాలంలో సరైన వర్షాలు కు రువకపోగా, భూగర్భజలాలు సైతం అడుగంటడంతో సా గునీరు లేక రైతులు, అటు తాగునీటి కోసం ప్రజలు ఆం దోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాకు సాగు,తాగునీటికి వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం వట్టిపోయే దశకు చేరుకున్నది. దీంతో జిల్లా ప్రజలకు తాగునీటి గండం తప్పేటట్లు లేదు. ఇప్పటికే జూరాలలో నీరు లేక కుడి,ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు అధికారు లు క్రాప్ హాలిడే ప్రకటించడంతో చాలా వరకు రైతులు పంటలు సాగు చేయలేదు.
ఈ ఏప్రిల్ మాసంలో ప్రజలకు తాగునీటి గండం తప్పేలా లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే కర్ణాటక మాదిరిగా నీటి కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొనే పరిస్థితులు రాకమానవు. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, 3.546 టీఎంసీలు డెడ్ స్టోరేజీలో ఉంది. మిగిలిన నీటిని మాత్రమే గ్రావిటీ ద్వారా విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.546 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. దీంతో ప్రజలు తాగు నీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నది.
ఎగువన వర్షాలు సరిగా కురువని కారణంగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. 2016లో జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోగా, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట పట్టణాలకు తీవ్ర నీటి ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేసి డెడ్స్టోరేజీలో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం తరలించారు. ప్ర స్తుతం అదే పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో తాగునీటి అవసరాలకు ఏడాదికి ఎండ తీవ్రత ఆవిరి రూపంలో వెళ్లే నీటిని కలుపుకొని 1.50 టీఎంసీలు అవసరం. ప్రతి రోజూ 74 ఎంఎల్డీలు అవసరమున్నట్లు మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశ యం పూర్తిగా అడుగంటిపోగా డెడ్స్టోరేజీతో కలిపి 3.5 46 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ప్ర స్తుతమున్న నీరు ఏప్రిల్ 15వరకు తాగునీటికి సరిపోయే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పనిసరి కానున్నాయి. గతేడాది మార్చిలో జూరాల ప్రా జెక్టులో 4.262 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఈ ఏడాది మార్చిలో అది కాస్త 3.546కు తగ్గిపోయింది.
వేసవి ఆరంభంలోనే తాగునీటి ఎద్దడి మొదలైంది. జో గుళాంబ గద్వాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ట్యాంక్లర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయిజ మండలం రాజాపూర్, చిన్నతాండ్రపాడ్ గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. సంకాపురంలో ప్రజలకు నీటి ఇబ్బందులు ఏర్పడగా, గ్రామస్తులు చందాలు వేసుకొని బోరు రిపేరు చేయించుకున్నారు.
గద్వాల మండలం జం గంపల్లి, పూడూరు, సంగాల పట్టణ సమీపంలోని జమ్మిచేడు, గట్టు మండలం ఆలూరు, అలంపూర్ పట్టణంలో నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చే శారు. అధికారులు తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయకపోతే పరిస్థితి మరింత తీవ్రతరం కానున్న ది. ప్రస్తుతం గ్రామ, పట్టణాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి తలె త్తే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతిపంపుల మరమ్మతులు, బో ర్లుప్లసింగ్ వంటి పనులు చేపడుతున్నారు. వీటి ద్వారా కూడా ప్రజలకు నీటి కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు.