కల్వకుర్తి, ఫిబ్రవరి 1: కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వేరుశనగ పోటెత్తింది. మొత్తం 206 మంది రైతులు 8,758 బస్తా ల వేరుశనగను మార్కెట్కు తీసుకొచ్చారు. వేరుశనగకు గరిష్ఠంగా రూ.7,317, మధ్యస్తంగా రూ. 7,107, కనిష్ఠంగా రూ.4,461 ధర పలికింది.
మా ర్కెట్కు సెస్ ద్వారా భారీగానే ఆదాయం సమకూరుతున్నా, రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఎండ బాగా ఉండడంతో రైతులు చెట్లకింద, ట్రాక్ట ర్, డీసీఎం వా హనాల కింద సేదదీరారు.