మహబూబ్నగర్టౌన్, మార్చి 30 : పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కౌన్సిల్లో తీర్మానం చేశారు. అనంతరం చైర్మన్ నర్సింహులు మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యల పై సభ్యులు అధికారులకు ఫోన్ చేస్తే స్పం దించాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపా రు. మహబూబ్నగర్ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్గౌడ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. పట్టణంలో రోడ్డు విస్తరణతోపాటు చౌరస్తాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం 57 అం శాలకు సంబంధించిన పనులపై కౌన్సిల్లో తీర్మానం చేశారు. అంతకుముందు వివిధ వార్డుల కౌన్సిలర్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు ఉన్నారు.