మక్తల్టౌన్, అక్టోబర్ 28: వ్యవసాయరంగం అభివృ ద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు ల సాధికారత కోసం నిర్మించిన రైతు వేదికలు ఎంతో సద్వినియోగమవుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో నూతనోత్తేజాన్ని కల్పించి, పంటల సాగులో నూతన పద్దతులపై , మార్కెట్ విధానంపై వ్యావసాయాధికారులు అవగాహన కల్పించ కల్పించడంతో పాటు, ఒకేచోట రైతన్నలు సమూహంగా ఏర్పడి పంటల సాగుపై చర్చించేందుకు రైతువేదికల చక్క టి వేదికగా నిల్చాయంటున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణ మండలాల్లో రూ.8.80 కోట్లతో 40రైతు వేదికలను నిర్మించారు.
మండలాలాల్లో క్లస్టర్ వారిగా రైతువేదికలను నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22లక్షలు కేటాయించడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అద్భుతమైన రీతిలో రైతువేధికల నిర్మాణం చేపట్టారు. మక్తల్ మండలంలోని రుద్రసము ద్రం, సత్యవార్, గుర్లపల్లి, పస్పుల, కర్ని, గడ్డంపల్లి, మాద్వార్, జక్లేర్, మంథన్గౌడ్లో రూ.కోటీ 98లక్షలతో రైతువేధికలను నిర్మించారు. కృష్ణ మండలంలో హిందూపూర్, కున్సీ, చేగుంట, ముడుమాల్, గుడేబల్లుర్లో రూ. కోటీ 10లక్షలతో, మాగనూర్ మండలం మాగనూర్, కొత్తపల్లి, వర్కూర్, నేరడుగం, వడ్వాట్, అడవిసత్యారం, మందిపల్లో రూ.కోటీ 54లక్షలు, నర్వ మండలంలో నర్వ, రాయికోడ్, పాతర్చేడ్, కల్వాల్, పెద్దకడ్మూర్, లంకాల్, ఉందేకోడ్లో రూ.కోటీ 54లక్షలు, ఊట్కూర్ మండలంలో ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, పులిమామిడి, పగిడిమర్రి, బిజ్వార్, పెద్దజెట్రం, నిడుగుర్తి, అమీన్పూర్, కొల్లూర్లో రూ.2కోట్ల20లక్షలు, మరికల్ మండలంలో రూ.44లక్షలతో రెండు రైతువేధికలను నిర్మించా రు. ఒక్కో రైతువేదికలో 125 మంది రైతులు సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేశారు. రైతువేధికల్లో ఆయా క్లస్టర్ పరిధిలోని రైతులతో వ్యవసాయాధికారులు సమావేశమై నూతన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో సాగుపై తమకు మరింత ఆసక్తి పెరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుపై అద్భుతమైన ప్రణాళికలను రూపొందించి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ బాసటగా నిలుస్తున్న కేసీఆర్ సార్కే తమ మద్దతు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఎంతో ఉపయోగ పడుతున్నది
వ్యవసాయ రంగంలో నూతన పంటల సాగుపై వ్యవసాయాధికారుల సూ చనలు సలహాలు తీసుకునేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నది. తెలంగాణ ప్రభు త్వం రైతుల అభివృద్ధి కో సం ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయడం ఆనందంగా వుంది.
– కిష్టప్ప రైతు, ఉప్పర్పల్లి
స్థలం ఉండేదికాదు
గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఒకచోట సమావేశం కావాలంటే స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ రైతన్నల అభివృద్ధికోసం రైతువేదికలు నిర్మాణం చేపట్టడంతో రైతులంతా ఒకే దగ్గర సమావేశమయ్యేందుకు అన్ని వసతులతో చక్కటి వేదికలు నిర్మించారు.
-మహదేవ్, మాగనూర్