అచ్చంపేట, జూలై 14 : ప్రాజెక్టులను అడ్డుకుంటే పు ట్టగతులుండవని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. మండలంలోని హాజీపూర్ గ్రా మంలో శుక్రవారం విప్ గువ్వల పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు గేటు నుంచి ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వెళ్లి ముదిరాజ్ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ గువ్వల మాట్లాడారు. నిత్యం ప్రజల గు రించే ఆలోచిస్తుంటానన్నారు. తనను రెండుసార్లు గెలిపించిన ప్రజానికానికి రుణపడి ఉంటానన్నారు. పుల్జాల నుంచి చంద్రసాగర్ వరకు చేపట్టిన ఎంజీకేఎల్ఐ కా లువ పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నాయని, వాటినన్నింటినీ అధిగమించి ప నులు చేపట్టామన్నారు. ప్రాజెక్టులు పూర్తైతే తమకు ఓట్లు రావని నిస్వార్థంతో అమాయక రైతులను రెచ్చగొట్టారన్నారు. చిల్లర రాజకీయాలకు భయపడేదిలేదన్నారు. రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. ని యోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు రూ.23వేల కోట్లతో మంజూరు చేసిన ఉమామహేశ్వరం, చెన్నకేశవస్వామి ప్రాజెక్టులు టెండర్ దశకు చేరుకున్నాయన్నారు. టెండర్ పూర్తయిన వెంటనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా పనులు ప్రారంభించుకుందామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలో సాగునీటిని తీసుకొస్తామన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అనంతరం హాజీపూర్ గ్రామానికి చెందిన దాదాపు వంద మంది కాంగ్రెస్ నాయకులు విప్ గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రైతులు, ప్రజల కోసం మంచిగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటామని ప్రజలు మూకుమ్మడిగా ప్రకటించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మండలాధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పర్వతాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, సర్పంచులు లోక్యానాయక్, విష్ణువర్ధన్రెడ్డి, నాయకుడు జగన్ పాల్గొన్నారు.