పెద్దమందడి, మే 6 : మండలంలోని మణిగిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను చూడలేక సొంత గూటికి చేరుకున్నామని నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్సాగర్ పేర్కొన్నారు.
అనంతరం మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కొత్త, పాత తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, రాంరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాములు, శేఖర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, బుచ్చన్న, నర్సింహగౌడ్, రామకృష్ణారెడ్డి, రాంరెడ్డి, ప్రతాపరెడ్డి, చెన్నయ్య, గణేశ్, రాఘవేందర్, మహేశ్, మ ల్లికార్జున్, తిరుపతయ్య, వెంకటయ్య, ఊషయ్య, ఆనంద్రెడ్డి, బాలరాజు, శ్రీకాంత్రెడ్డి, బీకే నాయుడు, అంజినాయుడు, సాయికుమార్, మన్యం, రాజు, పవన్కుమా ర్, శివకృష్ణ, నాయకులు తదిదతరులు పాల్గొన్నారు.