కాంగ్రెస్ తీరు దళారి వ్యవస్థకు దారి చూపినట్లుంది. ధరణిని తీసేస్తే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. ఒక సామాన్యుడు తాసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు రైతులు ఎవరూ మరువలేరు. వీఆర్వోలు ఒకరి భూమి మరొకరి రాసి పహణీలు, నకళ్లు ఇచ్చేవారు. దీంతో అమాయకపు రైతుల భూములను మరొకరు పట్టాలు చేసుకున్నారు. భూ సమస్యలపై పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్ట్టూ తిరిగిన పరిష్కారం కాలేవు. రిజిస్ట్రేషన్లు చేసుకోవాంటే ఎక్కడో సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారం పది రోజులు టైం పడుతుండే. మధ్యలో దళారుల చేతులు తడిపితేనే రిజిస్ట్రేషన్లు అయితుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చి భూములకు భద్రత కల్పించారు. ఇప్పుడు ఏ కొట్లాటలు లేవు అరచేతిలో భూమి వివరాలు తెలుసుకుంటున్నాం. దళారీ వ్యవస్థ దూరమైంది. పది నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. వెనువెంటనే మ్యుటేషన్ పూర్తయి ఈ- పాసు బుక్ ఇస్తున్నారు. వారం, పది రోజుల్లో పట్టాదారు పాసుపుస్తకం నేరుగా ఇంటికి పోస్టులో వస్తుంది. ఇంత మంచిగ ఉన్న ధరణిని తీసెస్తామంటున్నారు కాంగ్రెసోళ్లు. వారు మతి ఉండే మాట్లాడుతున్నారో లేదో అర్థం కావటం లేవు. రైతుల భూసమస్యలు, కష్టాలను దూరం చేసిన కేసీఆర్ సర్కారుకే మా ఓటు.-పో
కౌలుచట్టం తీసుకొస్తే అసలు రైతులకు ఇబ్బందులు కలుగుతాయి. తన భూములను కౌలుకు ఇవ్వాలంటే కౌలుదారుతో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలని చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుంది. అలా అయితే చాలా ఏండ్లు కౌలుకు భూములు ఇస్తే ఇక ఆస్తి కౌలుదారుపై రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం వలన రైతులు తీవ్రంగా నష్టపోవడం, మొదటికే మోసం వచ్చే పరిస్థితి దాపురిస్తుంది. ఈచట్టం రావడం వల్ల రైతులు తమ భూములను కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాంతో కౌలుకు వచ్చే డబ్బులను నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు రైతులకు కాంగ్రెస్ మళ్లీ పాతకథే చెబుతుంది. మళ్లీ ఏళ్లనాటి కాలం వస్తదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైరవీకారులు రాజ్యమేలుతారని, లంచావతారులు పుట్టుకొస్తారు. పహాణి కావాలన్న కాళ్లరిగేలా తిప్పుకుంటారని, ఒకరిభూమి మరొకరికి రాసి రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉంటుంది. దీంతో భూములు పంచాయతీ మళ్లీ మొదలవుతాయి. ధరణితో అప్పటి బాధలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉన్నాం. భూమిపత్రాలు ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయని, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ సులువుగా జరుగుతున్నాయి. పహణీలు నిమిషాల్లో తీసుకోవడం జరుగుతుది. కాంగ్రెస్ నాయకులు మళ్లీ పాతకాలం తీసుకొచ్చి రైతుల మధ్య గొడవలు పెట్టించి నిండా ముంచాలని చూస్తున్నారు. వారిని నమ్మే పరిస్థితి లేదు. ధరణితో భూసమస్యలు తీరాయనుకుంటే కాంగ్రెస్ నాయకులు రోజుకో మాటలు చెబుతూ రైతుల భూములకు ఎసరు పెట్టేలా చేస్తున్నారు.
పట్వారి వ్యవస్థ తీసేసి తెలంగాణ ప్రభుత్వం మంచిపని చెసింది. మళ్లీ కాంగ్రెస్ వస్తే పాత పద్ధతి తీసుకొస్తా అంటుంది. దీంతో రైతులు దళారులను అశ్రయించాల్సి వస్తుంది. దళారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది. తాసీల్దార్ కార్యాలయంలో పైరవీకార్ల రాజ్యం మాకొద్దు, ధరణితో రైతుల పొలాలు సురక్షంగా ఉన్నాయి. రైతులకు తెలియకుండా భూములు పట్వారీలు పట్టాలు చేశారు. ధరణితో అ పద్ధతి మారింది. మాకు ధరణి కావాలి. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటే 24గంటల్లో తాసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే భూములు మా పేరున మారుతాయి. ఎవరికీ రూపాయి ఇవ్వకుండా మా చేతికి పట్టా పాస్బుక్లు వస్తాయి. గతంలో పట్టాపాస్ బుక్ల కోసం పట్వారీ లకు డబ్బులు ఇచ్చినా వారు నెలల తరబడి తిరిగిన తర్వాతే పాస్ బుక్ లు ఇచ్చే వారు. మాకు ఆ పరిస్థితి వద్దు. రైతులకు సులభతరంగా ఉన్న ధరణి తీస్తే రైతులకు నష్టాలు, కష్టాలు వస్తాయి. ధరణి లేకపోతే రైతులు అవస్థలు పడాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఆలోచించి భూముల సమస్యలకు పరిషారం కోసం పట్వారీ వ్యవస్థ లేకుండా ఎవరికీ నయా పైసా ఇవ్వకుండా భూముల కొనుగోలు, అమ్మకాలు నిమిషాల వ్యవధిలో జరిగిపోతున్నాయి. ధరణి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలోని సీఎం కేసీఆర్ రైతులను ఆరిగోసల నుంచి తప్పించిండు. ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్, పాసుబుక్ అమలు ప్రక్రియ సులభంగా ఒకే దగ్గర పూర్తవుతుంది. రైతుల కష్టాలు చేకూర్చే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతాం. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వానికి అండగా ఉంటాం.
ధరణి పోర్టల్ను ఎత్తివేయాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నరు. అట్లయితే మళ్లీ రైతుల మధ్య చిచ్చు పెట్టినట్లే.. ధరణి వచ్చినప్పటి నుంచే భూముల రక్షణ విషయంలో నిశ్చింతగా ఉన్నం. ఇదివరకు పహాణిల్లో వీఆర్వోలు ఇష్టమెచ్చినట్లు పేర్లు మార్చేది. ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు కాకపోయేటివి. ధరణిని తీసేసి కాంగ్రెసోళ్లు బాగుపడుదామనుకుంటున్నరు. గిప్పుడు గాపనులయ్యేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి తేవడంతో ఆతిప్పలు తప్పినయ్..గతంలో భూముల వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. అవసరాల కోసం భూములు అమ్మాలన్నా, కొనాలన్నా తాసీల్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. పైసలు ఇస్తేగాని పనిగాని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డులను సరిచేసి ధరణి పోర్టల్లో నమోదు చేసింది. ఇప్పుడు రైతులు భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ఎలాంటి ఇబ్బందులు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. పోర్టల్ ద్వారా ఆరగంటలో భూమి రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. 15నుంచి 20రోజుల్లో పాసు బుక్ ఇంటికి వస్తున్నది. రూపాయి కూడా లంచం ఎవ్వరికీ ఇయ్యాల్సిన పనిలేదు. మన వేలిముద్ర వేస్తేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. ముందుగాల వీళ్లనే అందులో వేస్తరు ప్రజలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే ధరణి తేవట్టి భూముల పనులు తొందరగైతున్నయ్.. ఇయ్యాల రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నయ్.. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగినయ్, పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతున్నయ్..భూ సమస్యలకు చెక్ పడింది. ఆనవసరంగా కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ మీద పడి వాళ్ల నెత్తి మీద వాళ్ల చెయ్యే పెట్టుకున్నరు. ధరణి రద్దు చేస్తే రైతుల బతుకులు ఆగమైతయ్. ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నయి. ధరణి వల్ల అన్ని విధాలా కరెక్టుగా ఉన్న భూములు అమ్మడం, కొనడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ రిజిస్ట్రేషన్ల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ బాగుంది. కొత్త పాస్ బుక్లో కొన్న భూమి వివరాలు నమోదు కావడంతో నాకు రైతు బంధు కూడా అందుతున్నది. ఎవరు ఏమన్నా ధరణి చాలా బాగుంది. ఒక్కో పార్టీ ఒక్కో రకం కథ మొదలుపెడుతది. మనం నమ్మొద్దు, నమ్మితే ఆగమైతం.
ధరణి పోర్టల్ తీసేస్తే రైతుల బతుకులు మళ్లీ అంధకారంలోకి పోతాయి. ఇంతకు ముందు రైతులు ఎకరం పొలం కొని అమలు చేసుకునేందుకూ రెవెన్యూ అధికారుల చుట్ట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని చేసేవారు కాదు. దళారులు, మధ్యవర్తులను తీసుకొని పోతేనే మాపొలం పట్టాదారు పాసుబుక్లు ఇచ్చేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే పొలం కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం , పది రోజుల్లో నేరుగా ఇంటి వద్దకే పట్టాదారు పాసుబుక్ పోస్ట్ ద్వారా వస్తది. ఇప్పుడు పట్వారీతో పనిలేదు, ఖర్చు లు, శ్రమ లేకుండా ఒక్కరోజే ఈ-పాస్బుక్ తీసుకుంటున్నాం. ధరణి పోర్టల్లో మన పేరు ఉందంటే రైతుబంధు సాయం సక్రమంగా మాఅకౌంట్లో నేరుగా పడుతున్నాయి. అంతేకాక దురదుష్టవశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా అందుతుంది. ఏనాయకులు, అధికారుల పని లేకుండా బీమా సొమ్ము బాధిత కుటుంబానికి నేరుగా అందుతున్నాయి. ఇంత మంచిగా ఉన్న ధరణి పోర్టల్ ను తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం వింతగా ఉంది. రైతులను మళ్లీ నిండా ముంచేందుకు కొత్త కుట్రలు చేయడం సిగ్గుచేటు. ధరణి తీసేస్తే రైతుల మళ్లీ అధికారులు చుట్టూ తిరుగుతూ దళారులను పెంచి పోషించేందుకూ కాంగ్రెస్ కుట్ర ప న్నుతుంది. రైతుల మేలుకోసం పనిచేసే బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి
కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారం లో కి వస్తే ఇప్పుడు న్న ధరణి పోర్టల్ను తీసి, ఆ స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని ప్రకటించారు. ధరణిని గనుక తీసేస్తే రైతులకు చాలా నష్టం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో పటేల్, పట్వారీల పరిస్థితులు మల్లా వస్తాయి. ఇప్పుడు రైతులు ధరణి ద్వారా పూర్తి భరోసాతో ఉంటున్నారు. మా పొలాలు మాకున్నాయని గుండె నిబ్బరంతో ఉన్నారు. ధరణి వల్ల రైతులకు నేరుగా భూమిమీద పూర్తి హక్కులు ఉన్నా యి. మళ్లీ కాంగ్రెస్ సర్కారు గనుక వస్తే ఎనుకటి కాలంలాగా అధికారుల, దళారుల రాజ్యం వస్తది. వాళ్లు ఎట్లా చెబితే అట్లా చేయాల్సిందే. కౌలు రైతులకు హక్కులు కల్పిస్తే భూములపై పట్టాదారుడికి అన్యాయం జరుగుతది. ఇప్పుడున్నటువంటి ధరణితో చాలా ఉపయోగకరంగా ఉంది. అందుకే మరోసారి కేసీఆర్ సర్కారు రావాలని రైతులంతా కోరుకుంటున్నారు..