అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రం లో కరువు వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. స్థానికేతరుడైన మల్లు రవి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీ రాములు సైతం ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, తన కొడుకుకు ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరి కేసీఆర్కు, పార్టీకి ద్రోహం చేశారన్నారు. అతడి కుమారుడిని ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపిస్తే ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ నాయకులను బెదిరించినా, ప్రలోభాలకు గురిచేసినా కలిసికట్టుగా పనిచేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.