కోస్గి, నవంబర్ 7 : తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న లభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, 60ఏండ్లు ప్రజలను హరిగోసకు గురిచేసిన కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని భూగర్భ, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని జాండ్ర కమ్యూనిటీ హాల్లో టీడీపీకి చెందిన డీకే రాములు, ఆయన అనుచరులు 100మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడంతో నియోజకర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
కొడంగల్లో ఈ ఐదేండ్లలో అభివృద్ధి ఏమీ లేదని రేవంత్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజల గురించి ఒక్కనాడైనా పట్టించుకోని వ్యక్తి అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 5గంటల కరెంట్ ఇవ్వడం లేదని, ఆ ప్రాంత రైతులు నేరుగా తెలంగాణకు వచ్చి నిరసన తెలుపడం చూస్తుంటే ఆ పార్టీ చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈనెల 9న పట్నం నరేందర్రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. స మావేశంలో ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు శ్రీను, బాలేశ్, జనాకర్దన్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు మ్యకల రాజేశ్, నాయకులు ఓంప్రకాశ్, వరప్రసాద్, వెంకట్నర్సింహులు పాల్గొన్నారు.