మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46ను ఎత్తివేసి పోలీసు నియామకాల్లో ఎన్నికైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని నమ్మించి తమను ఎన్నిక ల్లో వాడుకొని ఇప్పుడు పట్టించుకోకుండా అన్యాయంగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని పలువురు పోలీసు అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేశా రు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన 15వేల రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో ఎంపికైన అభ్యర్థులకు గురువారం హైదరాబాద్లో జీవో నెంబర్ 46 నిబంధనల ప్రకారం ని యామక పత్రాలు అందజేయడంతో పోలీసు అభ్యర్థులు జిల్లాలో ఆందోళన నిర్వహించారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఈ అభ్యర్థులను హైదరాబాద్ రానీయకుండా కట్టడి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలీసులు పలుచోట్ల అభ్యర్థులను పోలీస్స్టేషన్లో ఉంచి వారిని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జీ వో నెంబర్ 46 విరుద్ధంగా ఉందని, ఆ జీవోను రద్దు చేసి తమకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నచ్చజెప్పి తమతో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయమ ని చెప్పిన రేవంత్రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేసి గెలిపిస్తే తమకు తీవ్ర అన్యాయం చేశారని వారు మండిపడ్డారు.