నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాల (Congress Goons ) దాడికి నిరసనగా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగి 14 గంటలు అవు తున్నా, అన్ని ఆధారాలు ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ఊడిగం చేస్తూ పోలీసులు ఇంత వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు. పథకం ప్రకారం బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.