మహబూబ్నగర్టౌన్, మే 28 : పదోతరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు నిర్వహించి న సాంఘికశాస్త్రం పరీక్షకు 13,283మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,087మంది హాజరయ్యారు. 196మం ది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్ స్వాడ్స్, 11మంది కస్టోడియన్ అధికారులు, 666మంది ఇన్విజిలేటర్లు, 59మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 59 మంది డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్న అధికారులు, సిబ్బందిని విద్యాశాఖ జిల్లా అధికారి ఉషారాణి అభినందించారు.
దేవరకద్ర రూరల్, మే 28 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దేవరకద్ర మండలంలో నాలుగు పరీక్షాకేంద్రాల్లో మొత్తం 932మంది విద్యార్థులు పరీక్ష రా యాల్సి ఉండగా, 907మంది హాజరయ్యా రు. 25మంది పరీక్షకు గైర్హాజరైనట్లు ఎంఈ వో జయశ్రీ తెలిపారు. అలాగే చిన్నచింతకుంట మండలంలో రెండు పరీక్ష కేంద్రాల్లో 483మంది విద్యార్థులకుగానూ 10మంది గైర్హాజరు కాగా, 473మంది పరీక్ష రాసినట్లు ఎంఈవో లక్ష్మణ్సింగ్ తెలిపారు.
రాజాపూర్, మే 28 : మండలంలో పదోతరగతి పరీక్షలకు వందశాతం విద్యార్థులు హాజరైనట్లు రాజాపూర్ పరీక్షాకేంద్రం ఇన్చార్జి గోవర్ధన్రెడ్డి తెలిపారు. మొత్తం 235 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలను తాసిల్దార్ శం కర్, ఎంపీడీవో లక్ష్మీదేవి పర్యవేక్షించారు.