మహబూబ్నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబ్నగర్ రూరల్ : గడిచిన 15 రో జులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబురాలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మ హబూబ్నగర్ రూరల్ మండలం కోడూరు నుంచి మ న్యంకొండ స్టేజీ వరకు రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ట్రాక్టర్ నడిపారు. సుమారు కిలోమీటర్ మేర రాయిచూరు హైవేపై ర్యాలీ కొనసాగింది. అనంతరం కోడూరు రైతు వేదికలో మంత్రి మాట్లాడారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు నీతి తప్పడని, అలాంటి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ప్ర తి ఒక్కరిపై ఉందన్నారు. గతంలో రైతులు సాగునీటి కి, విద్యుత్కు, విత్తనాలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. ఉచిత విద్యుత్తో పాటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రైతు బీమా ద్వారా అన్నదాతకు భరోసా ఇచ్చారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన ప్ర మాణాలు ఎంతో మెరుగయ్యాయని తెలిపారు. గ్రామా లు కళకళలాడుతున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ఏడేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రైతుకు గతంలో ఎప్పుడూ లేనంత గుర్తింపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వచ్చిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు, రైతులకు తెలిసేలా రైతుబంధు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, పీఏసీసీఎస్ ప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ఈ రోజు వెలిగిపోతుందంటే అందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభిమాన మే కారణమన్నారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతుల కల నెరవేరుస్తామన్నారు. రైతు బంధు పథకం కింద ఒక్క మహబూబ్నగర్ నియోజకవర్గానికే రూ. 200 కోట్లు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రూ. 1460 కోట్లు అందాయన్నారు. రైతుబంధు సంబురాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమం లో మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాక ర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, రైతుబంధు సమితి జి ల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, రైతుబంధు డైరెక్టర్ నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధా శ్రీ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్, మాజీ మార్కెట్ క మిటీ చైర్మన్ రాజేశ్వర్, ఆంజనేయులు, సర్పంచ్ చం ద్రకళ, పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
పేదల తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తాం..
పేదల తిరుపతి, మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన నూతన పాలక మండలి ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మన్యంకొండ వెలుగొందుతుందన్నారు. ము నుల కొండగా, రెండో తిరుపతిగా, ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. నూతన పాలకమండలి మన్యంకొండ ఆలయం అభివృద్ధికి సేవ చేయడం అదృష్టంగా భావించాలని ఆయన సూచించారు. కొండపై ని ర్మిస్తున్న 18 గదులు 4 నెలల్లో పూర్తి చేయాలని, నూ తన పాలక మండలి సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఒక్కరూ ఒక గది నిర్మాణాన్ని బాధ్యత తీసుకోవాలని, గదులను స్టార్ హోటల్ లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలివేలుమంగ దేవాలయం వద్ద నిర్మిస్తున్న ఏసీ ఫంక్షన్ హాల్ను కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కొండపై మరో వంద గదులు, క్యూ కాంప్లెక్స్, అన్నదానం, కల్యాణమండపం, కోనేరు సుందరీకరణ వంటి పనులు చేపట్టేందు కు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వివాహాలు చే సుకునేందుకు ముందుకు వస్తే వారికి ఉచితంగా భో జనం అందించే ఏర్పాటు చేయాలని, ఇందుకు దాతలు ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మధుసూదన్, దేవాదా య శాఖ ఏసీ శ్రీనివాసరాజు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.