పెంట్లవెల్లి, పిబ్రవరి 8 : మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మధ్య రోజురోజుకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ వ్యవహా రం మూడు నెలల నుంచి కొనసాగుతుందని ఉద్యోగు లు, సిబ్బంది బహిరంగంగా చెబుతున్నారు. దీనిని ని జం చేస్తూ ఎంపీడీవో రామయ్య పెంట్లవెల్లి పంచాయతీ కార్యదర్శి సాధిక్పై గురువారం పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో మరింత బహిర్గతమైంది. ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగుల వివరాల ప్రకారం.. ఎంపీడీవో రామయ్య కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులతో అవసరం ఉందంటూ డబ్బులు తీసుకొనే వారు. ఉద్యోగులు, సిబ్బంది తిరిగి డబ్బులు అడిగితే ఏదో వంకతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాపైనే నిందలు మోపుతూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేవాడని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో పంచాయతీ కార్యదర్శి సాధిక్ మాట్లాడుతూ ఎంపీడీవో రామయ్య అవసరం ఉందం టే చాలా సార్లు రూ.20 వేలు, 30 వేలు ఇచ్చాను, తి రిగి ఇచ్చారు. గత మూడు నెలల కిందట రూ.35 వేలు అవసరం ఉందని ఎంపీడీవో నా వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఈమధ్య కాలంలో నేను కిందపడి అనారోగ్యానికి గురయ్యాను. డబ్బులు అవసరం ఉందని ఎం పీడీవోను అడగడంతో నాపై కోపం పెంచుకొని బుధవారం పెంట్లవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగుల ముందు బూతులు తిట్టారని.. దీంతో గురువారం నా డబ్బులు నాకు కావాలని గట్టిగా అడగడంతో నాపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇదే విషయంపై ఎంపీడీవో రామయ్యను వివరణ కోరగా పెంట్లవెల్లి పంచాయతీ కార్యదర్శి వద్ద గతంతో చాలా సార్లు డబ్బులు తీసుకొని ఇచ్చాను.
అదే మాదిరిగానే రూ.35 వేలు చే బదులుగా తీసుకున్నమాట వాస్తవమేనని, బుధవారం గ్రామ పంచాయతీలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది సరికాదని సూచించడం జరిగిందన్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శి సాధిక్ మద్యంతాగి ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఉద్యోగుల ముందు తనను నానా బూతులు తిట్టారని, విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఇదిలా ఉంటే ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల కిందట దరఖాస్తులను స్వీకరించింది. ఇచ్చిన దరఖాస్తుల వివరాలు తెలుసుకుందామ ని కార్యాలయానికి వచ్చిన ప్రజలకు కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం చూసి ఇదేం కార్యాలయం.. ఇదేమీ పాలన రా బాబు అని చర్చించుకోవడం కనిపించింది.