మహబూబ్నగర్, అక్టోబర్ 27 : యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ మొదటి వారంలో యాసంగి ధాన్యం కొనుగోలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తించిన కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించాలని తెలిపారు. వానకాలంలో ప్రారంభించిన కేంద్రాలు ఇప్పుడు అవసరాన్ని బట్టి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ప్రతి ఏవో, వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలో రెండు కేంద్రాలను పరిశీలించాలని, పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతే ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్ ఉంచాలని సూచించారు. రవాణాకు సంబంధించి ముందస్తుగా లారీలను అందుబాటులో ఉంచుకోవాలని, రైస్ మిల్లులకు ముందే ట్యాగ్ చేయాలని చెప్పారు. ఎప్పటి ధాన్యాన్ని అప్పుడే లిఫ్ట్ చేసే విధంగా చూడాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఈ యాసంగిలో స్వయం సహాయక సంఘాల ద్వారా 101 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 85 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 4, మెప్మా ద్వారా ఒకటి మొత్తం 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్రా వు, డీఆర్డీవో యాదయ్య, జి ల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ప్రవీణ్, అధికారులు శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా రూ.50వేల కంటే అధికం గా తీసుకెళ్తున్న వారి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 78 కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం ప్రకటనలో కలెక్టర్ రవినాయక్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి రూ.2.76 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుల్లో 74 కేసులకు రూ.2.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 అభరణాల కేసులు గుర్తించి రూ.కోటి 68 లక్షలవిలువైన అభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీ నం చేసుకున్న వాటిలో 64 కేసులకు సంబంధించి రూ.2.36కోట్ల నగదును విడుదల చేశామని తెలిపారు. మొత్తం 68 కేసులు విడుదల చేశామని కలెక్టర్ వెల్లడించారు. రూ.23,59,740 నగదును సంబంధించి పది కేసులు వివిధ దశలలో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.