నారాయణపేట రూరల్, మార్చి 30: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్ కార్యక్రమానికి హాజరై అధ్యక్షత వహించి టీప్రైడ్ నుంచి 36ఎస్సీ యూనిట్లు, 40 ఎస్టీ యూనిట్లు, పీహెచ్సీ కేటగిరీలో 5 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరు చేస్తున్న యూనిట్లలో అత్యధికం మోటారు వాహనాలు మాత్రమే ఉన్నాయని ఇతర యూనిట్లపై ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జీఎం ఇండస్ట్రీస్ రామ సుబ్బారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసన్నకుమార్, లేబర్ ఆఫీసర్ రాజ్కుమార్, డీపీవో మురళి పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, మార్చి 30: అడుగంటిపోతున్న భూగర్భ జలాలు పెంచేందుకు జాతీయ ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. బుధవారం సింగారం గేట్ వద్ద నైపుణ్య శిక్షణా కేంద్రంలో కేంద్రియ భూగర్భ జలబోర్డు, దక్షిణ క్షేత్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో భూగర్భ జలాల సమస్యల నిర్వహనపై జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటిని భూమిలో ఇంకేవిధంగా చూడాలన్నారు. భూగర్భ జలాల బోర్డు రీజినల్ డైరెక్టర్ సిద్ధార్థ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలపై సర్వేచేసి నివేదికను కలెక్టర్కు అందజేశామన్నారు.
జల సంరక్షణ సమస్యలపై డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ ఎస్ఎస్ విట్టల, శాస్త్రవేత్త మాధవ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఆర్డీవో గోపాల్నాయక్, భూగర్భ జల జిల్లా అధికారి రాజేందర్కుమార్, వ్యవసాయ అదికారి జాన్ సుధాకర్,అటవీశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.