వనపర్తి, డిసెంబర్ 16 : స్వరాష్ట్ర పాలనలో గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అం డగా నిలిచారని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 232 మందికి రూ.2.32 కోట్ల విలువైన క ల్యాణలక్ష్మి, షాదీముబారక్, 205 మందికి రూ.64.28 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ముందుగా లబ్ధిదారులు, బాధితులతో కలిసి మంత్రి స హపంక్తి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదింటి ఆడబిడ్డల పెండ్లి ధూంధాంగా జరుగుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా వారి పెండ్లికి ఆర్థిక సాయం అందజేస్తున్నారని చెప్పారు. అనారోగ్యంపాలైన బాధితులు మెరుగైన వైద్య సేవల కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నామన్నారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్వన్గా మారిందన్నారు. మన పథకాలు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ను ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.
రైతేరాజు ఇప్పటి వరకు రాజకీయ పార్టీల నినాదమని, రైతును రాజును చేయడమే బీఆర్ఎస్ విధానమని పేర్కొన్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వం ఏర్పాటుకు పోరాడుతామని ఆయనన్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయం భారంగా మారిందని ధ్వజమెత్తారు. రైతు రాజ్యస్థాపన కోసం రాజీలేని పోరాటాన్ని కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.