నారాయణపేటరూరల్, జూన్ 9: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పేట మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కొల్లంపల్లి గ్రామానికి చెందిన అసియాకు రూ.18 వేలు, భైరంకొండ నర్సమ్మకు రూ.40 వేలు, జాజాపూర్ లక్ష్మన్నకు రూ. 30 వేలు, శ్రీనివాస్కు రూ.28 వేలు, నిరంజన్కు రూ.23వేలు, గనిమోనిబండ ఇందిరమ్మకు రూ.25500, మంగమ్మకు రూ. 13 వేలు, బోయిన్పల్లితండా దేవమ్మకు రూ.18 వేల వైద్య ఖర్చుల కోసం మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కార్పొట్స్థాయిలో వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలు చేస్తున్నారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, యూత్ అధ్యక్షుడు మోహన్నాయక్, రాములు, కిష్టప్ప, హారీఫ్ తదితరులు పాల్గ్గొన్నారు. అలాగే బండగొండలో మహిళ సంఘం భవనం నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు రూ.15 లక్షలు, లింగంపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద షెడ్డు నిర్మాణానికి రూ. 22 లక్షల ప్రొసీడింగ్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు.
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
మండలంలోని తీలేరు గ్రామానికి చెంది న మహదేవమ్మకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. బడుగు బలహీన వర్గల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్త్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.