మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ పాల్గొన్నారు.