ఏదుల.. పాలమూరు ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ ప్రాజెక్టులో సర్జ్పూల్ మాత్రమే కాదు.. పంప్హౌస్ కూడా పెద్దదే.. 357 మీటర్ల పొడవు, 90 మీటర్ల ఎత్తు.. 30 మీటర్ల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద డీప్వెల్ సర్జ్పూల్గా రికార్డు నెలకొల్పింది. పంప్హౌస్ పొడవు 420 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు. ఇక్కడి నుంచి 145 మెగావాట్ల పంపులు (9+1, ఒకటి స్టాండ్బై) నీటిని ఏకంగా 124 మీటర్లపైకి ఎత్తిపోయనున్నాయి. ఇదీ ఓ రికార్డే. అత్యంత భారీ సర్జ్పూల్ ‘భూగర్భ’ నిర్మాణాల్లో ఆసియాలోనే అతిపెద్దదిగా ఖ్యాతిని సొంతం చేసుకోనున్నది. ఇక్కడి రిజర్వాయర్ను 6.75 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పర్యవేక్షణలో 24 నెలల్లోనే పనులు పూర్తయ్యాయి. భూములు, ఊర్లు కోల్పోయిన బాధితులకు ఆర్ఎన్ఆర్ సెంటర్లు నిర్మించారు. సీఎం కేసీఆర్ నేరుగా వారితో మాట్లాడారు. ఇలా నిర్మాణమైన ప్రాజెక్టు కృష్ణమ్మ రాక కోసం వేచిచూస్తున్నది. 16న నార్లాపూర్ వద్ద వెట్న్న్రు సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా.. త్వరలో ఏదులను జలశోభితం చేయనున్నది.
– వనపర్తి, సెప్టెంబర్ 10
వనపర్తి, సెప్టెంబర్ 10 : పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కానున్నది. దీంతో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్ని, కేసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తెలంగాణ సర్కారు న్యాయపరంగా పోరాడి అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులను పూర్తి చేసింది. పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్ నుంచి ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు అత్యంత కీలకం. నార్లాపూర్ నుంచి నీటిని ఎత్తిపోయడం ద్వారా అక్కడి నుంచి ఏదులకు అక్కడి నుంచి వట్టెం, కరివెనతో ఉదండాపూర్ రిజర్వాయర్కు కృష్ణాజలాలు రానున్నాయి. భవిష్యత్లో హైదరాబాద్ వంటి మహానగరానికి సైతం తాగునీటిని అందించేలా పీఆర్ఎల్ఐ మారనుంది.
భూమి ధరలకు రెక్కలొచ్చే..
ఏదుల రిజర్వాయర్ రాకముందు రైతులు వ ర్షాధార పంటలు సాగు చేసేవారు. పీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్కు బీజం పడింది. రైతుల నుండి భూములు సేకరించేనాటికి ఏదులలో ఎకరం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పలికేది. జీవో 123 కింద భూసేకరణ చేయగా అప్పటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డు, ప్రస్తుత మంత్రి నిరంజన్రెడ్డి సీఎం కేసీఆర్ను ఒ ప్పించి ఎకరాకు రూ5.50లక్షలు ఇప్పించారు. ఈక్రమంలో రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యా క ప్రస్తుతం రూ. 25లక్షలు ఇస్తామన్నా ఎకరా పొలం దొరికే పరిస్థితి లేదని గ్రామస్తులు, రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.
ముంపు బాధితులతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి..
ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రైతన్నలకు మద్దతుగా మంత్రి నిరంజన్రెడ్డి అండగా నిలబడగా, సీఎం కేసీఆర్ నేరుగా వారితో ఫోన్లో మాట్లాడడమే కాకుండా ఒకసారి రిజర్వాయర్ వద్దే సమావేశమయ్యారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు పనులు ముమ్మరం చేసి ఏదుల రిజర్వాయర్కు తుది రూపాన్ని తీసుకొచ్చారు. ముంపునకు గురైన బండరావిపాకుల, కొంకలపల్లి, రిజర్వాయర్ పరిధిలో 5వేల ఎకరాలు. ఇందులో 1299 పీడీఎఫ్ (ప్రాజెక్టు డిస్ప్లేస్ ఫ్యామిలీ) కింద ప్రభుత్వం గుర్తించి 850మందికి 250 గజాల ప్లాట్లతోపాటు రూ.55కోట్లతో బిల్డింగ్, కరెంటు వర్క్, విశాలమైన రోడ్డు సదుపాయంతో రెండు ఆర్ఎన్ఆర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. భూసేకరణ చేసే సమయంలో కేఎల్ఐ సాగునీరు రాలేనప్పటికీ మంత్రి నిరంజన్రెడ్డి సీఎం కేసీఆర్తో మాట్లాడి రిజర్వాయర్ పనులు ప్రారంభం కాకముందే ఎకరాకు రూ.లక్ష విలువ చేసే పొలాలకు సైతం జీవో 123 కింద రూ.5.50లక్షలు ఇప్పించారు.
సాగు, తాగునీటితోపాటు ఆహ్లాదాన్ని పంచనున్న రిజర్వాయర్..
సాగు, తాగునీటి వరప్రదాయినిగా ఏదుల రిజర్వాయర్ రూపుదిద్దుకుంటున్నది. చిన్నపాటి కాలువ ద్వారా నీళ్ల పండుగ చేసుకొనే స్థాయి నుంచి కొండల మధ్య ఇంత పెద్దస్థాయిలో నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించడం అందరినీ అబ్బురపర్చింది. ఏదుల రిజర్వాయర్లో కల్పిస్తున్న వసతులు, నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎంత ఎత్తులో నీటిని ఎత్తి పోస్తారు? ఎంత నిల్వ వంటి అంశాలు ప్రజలందరికీ అర్థం కావాలన్నదే మంత్రి నిరంజన్రెడ్డి ఆకాంక్ష. రెండు కొండల మధ్య పొడవాటి కట్టతో, కట్టకింది భాగంలో నిల్వనీరు, కట్ట పక్కన పచ్చని పొలాలతో అందమైన పల్లెటూళ్లు.. కనుచూపు మేరన పచ్చని పొలాలలతో ఆహ్లాదాన్ని పంచుతుండడం ఈ రిజర్వాయర్ ప్రత్యేకత.
దక్షిణ పాలమూరుకు లేదిక ఢోకా..
ఉమ్మడి రాష్ట్రంలో వలసెళ్లిన ప్రాంతాల్లో దక్షిణ పాలమూరు నుంచి వనపర్తి సైతం ఉన్నది. వనపర్తి మిట్ట ప్రాంతం కావడం, పక్కనే కృష్ణమ్మ సవ్వడులు చేస్తున్నా సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిచ్చేవి. ఈక్రమంలో ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ముందుచూపుతో పీఆర్ఎల్ఐకి రూపకల్పన చేశారు. శ్రీశైలం బ్యాక్వాటర్ జీరో పాయింట్ నుంచి నార్లాపూర్ పంప్హౌస్కు, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్కు కృష్ణమ్మ తరలి రానున్నది. దీంతో సాగు, తాగునీటికి భవిష్యత్లో ఇబ్బందులుండవు. రిజర్వాయర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తూములను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రి నిరంజన్రెడ్డి నిత్య పర్యవేక్షణ..
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. వేగంగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏదుల రిజర్వాయర్ పనుల పురోగతిలో మంత్రి నిరంజన్రెడ్డి నిత్య పర్యవేక్షణ కూడా ఒక భాగమే. పనులు ప్రారంభమైనప్పటి నుంచి నెలలో ఒకట్రెండు సార్లు మంత్రి సందర్శించి సలహాలు , సూచనలు చేస్తూ అధికారులను చైతన్యం చేశారు. ఈక్రమంలో అధికారులు 24 గంటలు పనిచేస్తూ రికార్డుస్థాయిలో పూర్తి చేశారు. డీఈతోపాటు 20మంది ఇంజినీర్లు ఈ రిజర్వాయర్ పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
త్వరలోనే డ్రైరన్కు సిద్ధం..
ఈనెల 3వ తేదీన నార్లాపూర్ వద్ద సంబంధిత అధికారులు డ్రైరన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈక్రమంలో 16న నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి వచ్చిన నీటిని అనుసంధానంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ వద్ద డ్రైరన్ చేపట్టేందుకు సంబంధించిన పనులను వేగంగా పూర్తిచేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో డ్రై రన్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.
రిజర్వాయర్ రికార్డుల వివరాలు..
రికార్డుస్థాయిలో పూర్తి చేశాం..
రిజర్వాయర్ పనులను సమిష్టి కృషితో రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. భూసేకరణ సమయంలో సీఎం కేసీఆర్ బాధితులతో ఒకసారి ఫోన్లో మాట్లాడి, మరోసారి రిజర్వాయర్ స్థలం వద్దే మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి మాట్లాడారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. పనులను మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించగా చీఫ్ ఇంజినీర్ హమీద్ ఖాన్, ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్ సలహాలు, సూచనలు పలు త్వరగా పూర్తి చేయడానికి ఉపయోగపడ్డాయి. దాదాపు 20మంది ఇంజినీర్లు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేశారు.
– సత్యనారాయణగౌడ్, డీఈ, ఏదుల రిజర్వాయర్
మూడు నెలల్లోనే డబ్బులొచ్చాయ్..
సాధారణంగా సర్కారు నష్టపరిహారం అందాలంటే ఏండ్లు పడుతుందని శానా మంది అనేవారు. ఏదుల రిజర్వాయర్ కడతారంట.. అందులో మా పొలం పోతుందని భయపడేటోళ్లం. అనుకున్నట్లుగానే మాది నాలుగెకరాల 30 గుంటల భూమి పోయింది. సర్కారు మా పొలం తీసుకునే టైంల ఎకరాకు రూ.లక్ష, రోడ్డు పక్కన ఉంటే రూ.1.50లక్ష నుంచి రూ.2లక్షల దాకా పలికేది. అయితే ప్రభుత్వం అన్ని పైసలు ఇస్తదా? లేక తక్కువ ఇస్తదో అని గుబులుండే. మంత్రి నిరంజన్రెడ్డి మా పొలాలకు మూడు నెలల్లోనే ఎకరాకు రూ.5.50లక్షల చొప్పున ఇప్పించిండు. భూమి పోయిందన్న బాధ ఉన్నా, ఇంతమంది రైతులకు మంచి జరుగుతుందని తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది.
– బొగ్గుస్వామి, ఏదుల రిజర్వాయర్, బాధితుడు, ఏదుల గ్రామం
ఏదుల రిజర్వాయర్ రైతులకు వరం
ఏదుల రిజర్వాయర్తో సాగునీటి గోస తీరుతుంది. ఈ ప్రాజెక్టు మాకు పెద్ద వరంలాంటిది. ఇంత పెద్ద ఎత్తున నిర్మించే ప్రాజెక్టు మా ఊరి పేరు మీద ఏర్పాటవడం చాలా సంతోషంగా ఉంది. నాడు సాగునీరు లేక పొట్ట చేతబట్టుకొని వలసలు పోయినం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల ఏడాది పొడవునా రిజర్వాయర్ నిండా నీరు ఉంటుంది. దీంతో భూగర్భజలాలు సైతం పెరుగుతాయి. ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే కుటుంబసభ్యులతో కలిసుంటూ ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతాం.
– శ్రీనివాస్రెడ్డి, ఏదుల మాజీ సర్పంచ్
కరువు పోయింది..
కేసీఆర్ సర్కారు వచ్చినంక కరువు పోయింది. మంచి కాలంలో పడ్డాం. ఏటి నీళ్లతో ఊర్లో చెరువులు, కుంటలు నిండి ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనబడుతున్నాయి. ఉన్న ఊర్లోనే చేతినిండా పని దొరుకుతుంది. రైతులు, కూలీలు సంతోషంగా ఉన్నారు. ఏదుల రిజర్వాయర్తో సాగునీటి కష్టాలు దూరమవుతాయి. మాకు ఏదుల రిజర్వాయర్ ఒక వరమని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
– గుడ్ల లక్ష్మయ్య, రైతు, చాకల్పల్లి, గోపాల్పేట మండలం
రిజర్వాయర్ వద్ద మట్టి పనులు చేశా..
రిజర్వాయర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి చాలా రోజులు అక్కడే పని చేశా. ప్రాజెక్టు వద్ద ముండ్లకంప, మట్టిలో రాళ్లు ఏరే పని చేశా. ఈ మట్టి పని అయిపోయే వరకు మా ఊరి నుంచి శానా మందిమి పనికిపోయాం. ఇంత పెద్ద ప్రాజెక్టు వద్ద పనులు చేశామని చెప్పుకోవడం గర్వంగా ఉంది.
– సాయిలు, కూలీ, ఏదుల గ్రామం