మాగనూర్, నవంబర్ 6: మండల కేంద్రం నుంచి మండల అధ్యక్షుడు ఎ ల్లారెడ్ది అధ్వర్యంలో సోమవారం మఖ్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం ప్రజా అశీర్వాద సభకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అభిమానులు మం డల పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ వెం కట్రెడ్డి, ఆ యా గ్రామ సర్పంచులు నాయకులు మధుసూధన్ రెడ్డి, బసంత్రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా రు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల పాలన వస్తుంది. ద ళారులను నమ్మి గతంలో మోసంపోయినం. మళ్లీ మాకు ఆ రోజులు వద్దు. మాకు మంచి పాలన చేస్తున్న కేసీఆర్ సారే కావాలి. కాంగ్రెస్ చెప్పే మాట లు రైతులు ఎవరూ వినరు. గతంలో పాలించిన కాంగ్రెస్తో రైతులు విసిగిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా కలిగింది.
సీఎం కేసీఆర్ సారూ కులవృత్తు లవారికి చేయూతనిచ్చారు. మా కు గొర్రెలను పంపిణీ చేశారు. దీం తో మాకుటుంబం గొర్రెలను పెం చి జీవనోపాధి పొందుతున్నాం. కు లవృత్తులను ఆదరిస్తున్న కేసీఆర్ సార్ ను మళ్లీ గెలిపించుకుంటాం. పేట ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి ద్వారా గొర్రెలను పొందినాం. మళ్లీ మేము కారునే గెలిపిస్తాము. కాంగ్రెస్ గెలిస్తే అధోగతి పాలే.
ధన్వాడ, నవంబర్ 6 : నారాయణపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ఉద్యమ గాయకుడు ఏపూరి సోమన్న ఆటా పాటలతో ఉర్రూతలూగించారు. గులాబీల జెండాలే రామక్క.. గుర్తుల గుర్త్తుంచుకో రామక్క, సారే రావాలి.. మళ్లీ సారే గెలి వాలంటూ సాగిన పాటలతో సభా ప్రాంగ ణం జోష్తో నిండిపోయింది. పల్లెపల్లెనా సంక్షేమ పథకాలు, ప్రగతి పథాన తెలంగాణ అంటూ పాడిన పాటతో తె లంగాణలో జరిగిన అభివృద్ధిని కండ్లకు కట్టినట్లు పాడారు. జబ్బకు సంచి చేతుల జెండా పాటలకు కార్యకర్తలు తమ చేతిలో ఉన్న గులాబీ జెండాలను ఊపుతూ ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. కేసీఆర్ మళ్లీ మీరే సీఎం సార్ అంటూ పాడిన పాటకు కళాకారులతో పాటు సభపై ఉన్న వారు కూడా నృత్యాలు చేశారు. అంతకు ముందు రంగన్న పాడిన పాటలు కూడా కార్యకర్తలను ఉత్సాహపరిచాయి.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకు కేవలం 5గంటల కరెంట్ ఇస్తుంది. అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నరు. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కష్టాలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. మేము కుడా ప్రత్యక్షంగా చుస్తున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు. కారు పార్టీ ముద్దు. రైతులకోసం తపిస్తున్న కేసీఆర్ సారే మళ్లీ గెలుస్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అయితది. మా కు ఆ పార్టీ వద్దు. సీఎం సారు చెప్పినట్లు మేము కారు గుర్తునే గెలిపించుకుంటాం. రైతుబంధు వచ్చిన కా నుంచి మేము బయట పెట్టుబడికి అప్పు తెవడం బంద్ చేసి నం. కేసీఆర్ సారు వేస్తున్న రైతుబంధుతోనే వ్యవసాయం చేస్తున్నం. కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. మాకు కర్ణాటక కష్టాలు వద్దు, మేము బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామంటున్నా రు. ధరణి రద్దు చెస్తే రైతులకు కష్టాలు తప్పవు. గతంలో పాసు బుక్ల కోసం పైరవీలు చేసి డబ్బులు ఇచ్చేవాళ్లం. ధరణి వచ్చాక ఇంటికి పాస్బుక్లు వస్తున్నా యి. కాంగ్రెస్ వారు గెలిస్తే ధరణి రద్దు చేసి రైతులను కష్టాల పాలు చేస్తరు. మేము కేసీఆర్ సారు వెంటే ఉంటాం. ధరణి వచ్చాకే మా భూములకు రక్షణ ఉంది.
సీఎం కేసీఆర్ భూమిలేని వారికి కేసీఆర్ బీమా ఇస్తామన్నారు. భూమిలేని పేదలు మరణిస్తే రూ.5ల క్షల బీమా వస్తుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుం టే పేదల కుటుంబాలు బజారున పడుతాయి. మా కుటుంబాలకు కేసీఆర్ సారు ప్రకటించిన బీమాతో దీమాగా బతుకుతాం. రైతులకు రైతు బీమా ఇస్తున్నట్లు భూమి లేని వారికి కేసీఆర్ బీమా వల్ల లాభాలు ఉంటాయి. పేదల కుటుంబాలకు భరోసా కలుగుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో మైనార్టీలకు పెద్దపీట వే సింది. షాదీ ముబాకర్, మైనార్టీబంధు మాకు వరంగా మారింది. అ దే విధంగా మైనార్టీ గురుకుల పాఠశాల లు, రంజాన్ పండగ సందర్భంగా పేదలకు ప్రభుత్వం ద్వా రా తోఫా ఇస్తున్నారు. ప్రభుత్వమే ఇఫ్తార్ విందులు ఏర్పా టు చేయించడం గర్వంగా ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నా కుటుంబంలో కూతురు పెండ్ల్లికి ఆర్థిక సాయం అందింది. నేను ఎల్లప్పుడు కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా. నా కూతురు వివాహం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. పెండ్ల్లి జరిగిన కొద్ది రోజులకు కల్యాణలక్ష్మితో లక్షా పదహారు వేలు వచ్చాయి. అప్పు లు కట్టుకున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షే మ పథకాల ద్వారా ప్రతి గడపకూ ఏదో రకంగా లబ్ధి చేకూరింది. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టి దేశ విదేశాల్లో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. నా ఓటు కేసీఆర్కే కారు గుర్తకు ఓటేస్తా. మళ్లీ సారు సర్కారు కారు రావాలి.
పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టుతో మాపొలాలకు నీరు వస్తుం ది, మాకు మూడు పంటలకు నీరు వ స్తే రైతులు ఖుషిగా ఉంటారు. నారా యణపేటలోని జయమ్మ చెరువు కూడా నిండుతది. మేము కేసీఆర్ సారు మా టాలు నమ్ముతాం. కాంగ్రెస్ వారి మాటలు నమ్మం. పేట అభివృద్ధికి ఎమ్మెల్యే ఎస్.ఆర్రెడ్డి చేసిన కృషిని మరువం, మళ్లీ సారు గెలివాలి.