మరికల్, డిసెంబర్ 26 : రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తె లిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం మన అదృష్టమని, అం దుకే ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మం డలంలోని జిన్నారంలో సోమవారం ఏర్పాటు చేసిన క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫాం హౌస్లో సీఎం కేసీఆర్ పంటలను పరిశీలించి రైతులకు వి వరాలు తెలియజేస్తూ సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. రైతుల కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో రైతుబం ధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ఇథనాల్ కంపెనీ పనులు అడ్డుకోవడం తగదు
చిత్తనూర్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీని గ్రామస్తులు అడ్డుకోవడం తగదని ఎమ్మెల్యే చిట్టెం అ న్నారు. కంపెనీ వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నా రు. రైతులకు ఎలాంటి నష్టం రాదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కంపెనీనే పంటల ను కొనుగోలు చేస్తారన్నారు. కంపెనీ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ముందుగా నేనే కంపెనీని ముయిస్తానన్నారు. రైతులు కంపెనీపై అవగాహన కల్పించుకోవాలన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ శ్రీకళ, ఎంపీటీసీ రాజు, సర్పంచ్ భా స్కర్, ఉపసర్పంచ్ వసుంధర, నాయకులు పాల్గొన్నారు.