నవాబ్పేట, నవంబర్ 27 : కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్దపు హామీలను నమ్మి పోసపోయి ఓటేస్తే ప్రజలంతా గోస పడతారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని కొల్లూరు, కేశవరావుపల్లి, పోమాల, తిమ్మయ్యపల్లి, పుట్టోనిపల్లితండా, కామారం, పల్లెగడ్డ, గురుకుంట, ధర్పల్లి, జంగమయ్యపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు నిలిచిపోతుందని తెలిపారు. తాగునీటి కోసం మహిళలు మళ్లీ రాత్రి వేళల్లో జాగారం చేయాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపారు. 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దద్దమ్మలు గ్రామాల్లోని ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేక పోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిరుధ్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ దొంగ చెక్కులిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణానికి చెక్కులు ఇస్తున్నాడని.. తీరా గ్రామస్తులు బ్యాంకులకు వెళ్లి చూస్తే అక్కడ చెక్కుకు సంబంధించి అకౌంట్ కూడా లేదని విమర్శించారు. మూడోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొల్లూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందర్నాయక్, సర్పంచులు సౌజన్య, రజిని, కృష్ణయ్య, యాదమ్మ, తరుణ్నాయక్, చెన్నమ్మ, లక్ష్మమ్మ, వెంకటేశ్, ఎంపీటీసీ ఊర్మిళాదేవి, కోఆప్షన్ మండల సభ్యులు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, అబ్దుల్లా, రఘు, లక్ష్మయ్య, రఘుగౌడ్, నవనీతరావు, రమేశ్, శ్రీనివాస్యాదవ్, రాములునాయక్, నర్సింహులు, రవి, ఎర్రోళ్ల శ్రీను, రాజు, జంగయ్య పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 27 : ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మారువొద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వీరన్నపల్లి, ఉడిత్యాల, ఈదమ్మగడ్డతండా, పెద్దాయపల్లి, శేరిగూడ, నందారం, బాలానగర్, తిరుమలగిరి, చిన్నరేవల్లి గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్ట్రంలో ఇంటింటికీ సం క్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యా నిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందన్నా రు. అదేవిధంగా ఉడిత్యాల గ్రామాని కి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, బీఆర్ఎస్ మండ ల ఉపాధ్యక్షుడు స్లోమానాయక్ ఆధ్వర్యంలో కుం టలోపుతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జడ్చర్లటౌన్, నవంబర్ 27 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం కేసీఆర్ కావాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కూతురు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ని 18వ, 19వ వార్డుల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూతురు స్ఫూర్తి ఇంటింటి ప్రచారం చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె గడపగడప తిరుగుతూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలొస్తాయని బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను అందజేశారు. జడ్చర్లను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మరోసారి ఆశీర్వాదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమం లో ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ దానిష్, మాజీ ఎంపీపీ లక్ష్మి, శంకర్నాయక్, నాయకులు ఇఫ్తేకార్, శ్రీనివాస్, అనసూయ పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 27 : కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మితే మళ్లీ పాత రోజులు వస్తాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంతోపాటు మున్ననూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమమని, పని చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మండల కేంద్రంలో డప్పు చప్పులు, మహిళలు బోనాలు, మంగళహారతిలతో ఘనంగా స్వాగతం పలికారు. మీ గ్రామంలో చేసిన అభివృద్ధి చూడండి. రైతుల కోసం 24గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసర పింఛన్లు, రైతు బీమా, బీసీ బంధు, ఉచిత కుట్టుమిషన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అమర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపా టు మసిగుండ్లపల్లి, బోయిన్పల్లి, వేముల, వాడ్యాల్, కొత్తపల్లి, రాణిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపు కోసం అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పత్రాలను ఇంటింటికీ పంచుతూ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి మూడో సారి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ స ర్పం చులు అశ్వక్, చెన్నయ్య, ఉపసర్పంచ్ మతిన్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు తిరుపతి, నా యకులు శ్రీకాంత్, యాదయ్య, ఆంజనేయులు, శ్రీనయ్య, నరింహా, జంగిలయ్య, పాల్గొన్నారు.
జడ్చర్ల, నవంబర్ 27 : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచా రం జోరును పెంచింది. జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, కిష్టంపల్లి, మాచారం, గొల్లప ల్లి, చిన్న ఆదిరాల, కొల్లోనిమోర్లతండా, తుప్డగడ్డతండా, వాయిల్గడ్డ, శిఖర్గాన్పల్లి, తదితర గ్రా మాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు, సర్పంచులు ఇంటిం టి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ బీదప్రజల అభ్యున్నతికి ఎన్నో పథకాలను తీసుకొచ్చి అమలు చేశారన్నారు. మంగళవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దేవునిగుట్ట సర్పంచ్ రాములునాయక్, కిష్టంపల్లి సర్పంచ్ రామకృష్ణారెడ్డి, సరిత, రాజేశ్వర్రెడ్డి, రవీందర్రెడ్డి, మమతానవీన్రెడ్డి, ఇంతియాజ్ఖాన్, నాగిరెడ్డి, శంకర్నాయక్ పాల్గొన్నారు.