మక్తల్, నవంబర్ 6 : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న భీమా ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషి, సహకారంతో సాధించుకున్నామని, ఈ రోజు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు సాధించుకున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వదసభ నిర్వహించగా సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ఐదేండ్ల కిందట ఇదే ప్రాంతో ఇదే స్థలంలో మక్తల్ పట్టణానికి వచ్చి సీఎం కేసీఆర్ సారు ఇదే ప్రాంతంలో ఇదే వేదికపై మాట్లాడారు. ఈప్రాంత సమస్యలను ఎప్పుడు తనవద్దకు తీసుకువెళ్లినా సానుకూలంగా స్పందించారు. సీఎం కృషి వల్లనే మక్తల్లో భీమా ప్రాజెక్టులో అ ంతర్భాగమైన సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్లను పూర్తి చేసుకొని నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సా గునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అదే విధంగా మక్తల్ పట్టణంలో పేదలకు మెరుగైన వైద్య సేవలను అంధించడానికి 150 పడకల దవాఖానను మంజూ రు చేశారని, అలాగే డిగ్రీ కళాశాలతోపాటు ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భీమా ఎత్తిపోతల పథకం లో భాగంగా భూత్పూర్, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్లలో ముంపునకు గురైన నేరడి గొమ్ము, భూత్పూర్ గ్రామాలకు ఇండ్లకు సంబంధించి నష్ట పరిహారం, ఆర్ఆర్ సెంటర్ల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు విన్నవించారు. అలాగే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ నుంచి ఉట్కూర్ పెద్ద చెరువును నింపాలని, మక్తల్ పట్టణానికి ఉర్దూ మీడియం కళాశాలను ఏర్పాటు చేయాలని, మక్తల్ పట్టణంలో బస్సుడిపో ఏర్పాటు చేయాలని, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని, మక్తల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద కృష్ణానదిపై రూప్వే బ్రిడ్జి మంజూరు చేయాలి చేయాలని మందిపల్లి – గజరన్దొ డ్డి గ్రామాల మధ్య బ్రిడ్జి మంజూరి చేయాలని, సీఎంను కోరారు.
దేవుని దయ వల్ల ఈరోజు మక్తల్ పట్టణంలో జరిగిన ప్రజా ఆశ్వీర్వాద సభకు సీఎం కేసీఆర్ సారు వచ్చారని, హైదరాబాద్లో బయలు దేరిన హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరో హెలీక్యాప్టర్లో మక్తల్ పట్టణంలో ప్రజా ఆశ్వీర్వాద సభకు ఆలస్యంగా నైనా వచ్చారన్నారు. హెలీక్యాప్టర్లో సాం కేతిక లోపం వచ్చిన విషయం తెలియగానే ఎంతో టెన్సన్ పడ్డమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. ఉద యం నుంచి ఎంతో ఓపికతో వివిధ గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ పక్క నే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత హామీలతో ప్రజలను మోసం చేశారని వారి జిమ్మిక్కులు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాసురెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్పర్సన్ రజని, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, మక్తల్ ఎంపీపీ వన జ, ఆత్మకూర్ మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్లు నరసింహాగౌడ్, రాజేశ్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
మక్తల్టౌన్, నవంబర్ 6 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మక్తల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దంపతులు సీఎం కేసీఆర్కు హెల్ప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వా గతం పలికారు.