పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. మొత్తం 45,063 మంది విద్యార్థులకు గానూ 44,920 మంది హాజరుకాగా 143 మంది గైర్హాజరయ్యారు. తొలిరోజు విద్యార్థులు తల్లిదండ్రులు, వారి బంధువులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాధికారులు, స్కాడ్స్ తనిఖీ చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అరగంట ముం దు నుంచే అనుమతించారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఉపాధ్యాయులు తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడంతోపాటు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి, పరీక్షా సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. అలాగే సమీపంలోని జిరాక్స్ సెంటర్లు అన్ని బంద్ చేశారు. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు విద్యాధికారులు వెల్లడించారు. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన కురుమ హన్మంతు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మరణించినా బాధను దిగమింగుకొని అతడి కుమారుడు అజయ్ పరీక్షకు హాజరయ్యా రు. అలాగే శ్రీరంగాపూర్ మండలకేంద్రంలోని పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.