మక్తల్, జూలై 17 : కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని భగవాన్పల్లిలో వారికి సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ నమోదు ప్రక్రియను కేంద్రం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించిందని, ప్రతిఒక్కరూ తమ ఓటును కా పాడుకోవడం కోసం ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకొని నింపి బీఎల్వోలకు అందించేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ సుజాతా సురేశ్, మాజీ ఎంపీటీసీ ఆశిరెడ్డితోపాటు పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు ఉన్నారు.