BT Roads | ధన్వాడ, మే 28 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి తండా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం నిధు లు కేటాయిస్తున్నారు. దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో భాగంగా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి మండలంలోని తండాల రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రూ. 80 లక్షల వ్యయంతో మందిపల్లి పాతతండాకు బీటీ రోడ్డు వేయించారు. అలాగే ఎస్డీఫ్ పథకంలో రూ.3 కోట్లతో కిష్టాపూర్ నుంచి మడిగిలమూలతండాకు గల 4 కి.మీ మట్టిరోడ్డును బీటీగా మార్చారు. గతంలో ఈ తండాలకు సరియైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారమని గిరిజనులు అంటున్నారు.
వానకాలంలో మట్టి రోడ్లు బురదగా మారి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని దుస్థ్ధితి ఉండేదంటున్నారు. ప్రస్త్తుతం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మడిగిలమూలతండా రోడ్డు బీటీగా మారడంతో చీరలనర్సయ్యతండా, పులిరాళ్లతండా కిష్టాపూర్, రాంకిష్టయ్యపల్లి గ్రామాల రోడ్లకు మహర్దశ కల్గిందంటున్నారు. అదేవిధంగా కోయిల్కొండ మండలం రాజీవ్గాంధీ తండా నుంచి ధన్వాడ వరకు గల బీటీ రోడ్డు పునరుద్ధ్దరణకు ఎమ్మెల్యే రూ. 4 కోట్లు మంజురు చేయించగా ఆదివారం నాటికి పనులు పూర్తికావచ్చాయి. అలాగే రూ. 20లక్షలతో ఎంనోనిపల్లి నుంచి గున్ముక్ల వరకు, రూ.20లక్షలతో మందిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు వేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పట్టదల తో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయి స్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గత పాలకుల హయాం లో నిర్లక్ష్యానికి గురై సరైన రోడ్డు సౌకర్యం లేని కంసాన్పల్ల్లి, ఎంనోనిపల్లి, గున్ముక్ల, మంత్రోనిపల్లి, మందిపల్లితండా, మడిగలమూలతండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిదే. ఆయనకు మండల ప్రజ లు రుణపడి ఉంటారు.
– వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
గతపాలకులు తండాల అభివృద్ధ్ది గురించి ఏనాడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గిరిజన తండాల అభివృద్ధ్దిపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే మడిగలమూలతండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు వేయించారు. మా తండా ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం.
– వోన్యానాయక్, సర్పంచ్, మడిగలమూలతండా