పరిగి, నవంబర్ 7: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు గల మల్లె మోనిగూడ, 7వ వార్డుల పరిధిలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంక్షేమ పథకాలు పేదలకు అందని ద్రాక్షగానే మిగిలేవన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా పథకాలు అమలులోకి తీసుకు వచ్చారని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా, పేదింటి ఆడబిడ్డల వివాహానికి సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రతి పేద వారికి ఆసరా కల్పించేందుకు ఆసరా పింఛన్ల పెంపు, కేసీఆర్ కిట్ వంటి అనేక చక్కటి కార్యక్ర మాలతో పేదలకు ప్రయోజనం కలిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేయబడిన తాగునీటి సరఫరాతో నీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ అపట్టణ ధ్యక్షుడు మంగు సంతోష్, కౌన్సిలర్లు వెంకటేశ్, వారాల రవీంద్ర, వేముల కిరణ్, మునీర్, నాయ కు లు మౌలానా, ఆనెం నర్సింహులు, రాకేష్, నజీర్, విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
పూడూరు: జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండల కేంద్రంలో ఎమ్మె ల్యే సోదరి అర్చనారెడ్డి, సర్పంచ్ నవ్యారెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్య మంత్రి రైతుల కష్టాలను గుర్తించి రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. సీఎం అభ్యర్థికే గ్యారంటీ లేదు ప్రజలకు ఏమి గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రూ. 400 లకే వంట గ్యాస్, రూ.16వేల రైతు బంధు అమలు చేస్తారని వివరించారు. గత 60 సంవత్సరాల నుండి కాంగ్రెస్ చేయని అభివృద్ధిపనులు కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. దళిత బంధు నిరంతర ప్రక్రియ అన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీల మాటలు నమ్మి మోస పోవద్దని, కారుగుర్తుకే ఓటేయాలని ఆయ న ఓటర్లను కోరారు. వీరితో పాటు ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, రాంరెడ్డి, అజీమోద్దీన్, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహా రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాజేందర్రెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారొద్దీన్, ఉప సర్పంచ్ రాజేందర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాంచందర్, వెంకటయ్య, బుచ్చన్న ఉన్నారు.