హన్వాడ, మే 21 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట కొట్లాటలు, మహిళల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బస్టాప్ వద్ద కాకుండా మరో దగ్గర బస్సులు ఆపుతుండడంతో మహిళలు పరుగులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలకేంద్రంలో ఉదయం 9 గంటల సమయంలో వివిధ గ్రా మాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దాదాపుగా 25 మంది మహిళలు బస్టాప్కు చేరుకున్నారు. నాలుగు బస్సులు రాగా.. మహిళలు చెయ్యెత్తినా రెండు ఆపకుం డా వెళ్లాయి.
మహిళలు ఉం డడంతో మరో రెండు బస్సుల డ్రైవర్లు స్టాప్ వద్ద కాకుం డా దూరంగా ఆపారు. దీం తో మహిళలు బస్సు ఆపిన చోటు వరకు పరుగులు పె ట్టారు. 1:30 గంటలు గడిచి నా ఒక్క బస్సు కూడా ఆప డం లేదని, తమను చూసి దూరంగా నిలుపుతున్నారని మహిళలు ఆరోపించారు. దీంతో విసుగు చెందిన ఆడపడుచులు రోడ్డుపైకి బస్సుకు అడ్డంగా వెళ్లారు. బస్సులు ఆపకపోతే గమ్యానికి చేరుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు. బస్సులు నిలపని డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.