మహబూబ్నగర్, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పురాతన బౌద్ధ క్షేత్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించి, ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మికవేత్త నాగార్జునుడు నడియాడిన కేంద్రమైన విజయపురి (నేటి నాగార్జునసాగర్)లో సుమారు 200ఎకరాల్లో రూ.100 కోట్ల నిధులతో బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయి లో నిర్మించారన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలు బౌద్ధ సంస్కృతి పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు బౌద్ధ్ద క్షేత్రాల అభివృద్ధిపై రూ పొందించిన సావనీర్ గురించి మంత్రి వివరించారు. తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల బాదంకుర్తి, ఫణిగిరి, నేలకొండపల్లి లాంటి ప్రాంతాల్లో బుద్ధిజం ఎంతో వైభవాన్ని చాటిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ బుద్ధిజం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా బుద్ధవ నం ప్రాజెక్టును రూపకల్పన చేసి బుద్ధిజం అభివృద్ధి, బౌద్ధ ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకు లు నవీన్ గుణవర్ధనే, డాక్టర్ శివనాగిరెడ్డి, ప్ర ముఖ నటులు గగన్ మాలిక్, డాక్టర్ మౌనిక సి రివర్ధన, శ్రీలంక బౌద్ధ ఆధ్యాత్మికవేత్తలు, ఆ దేశ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.