కోస్గి, అక్టోబర్ 31 : తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్వన్ స్థానంలో రాష్ట్రం నిలిచిందని భూగర్భ గనులశాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం గుండుమాల్ మండలం బోగారంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదన్నారు. ఆ పార్టీకే తెలంగాణలో గ్యారెంటీ లేదన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కొడంగల్లో పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొడంగల్ నియోజకర్గంలో చేశారన్నారు. గుండుమల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మయమాటలు నమ్మొద్దన్నారు. నాయకులను డబ్బులతో కొనుగొలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బలవంతంగా ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం గుండుమాల్, బోగారం గ్రామాలకు చెందిన కాం గ్రెస్ నాయకులు మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో ఎంపీపీ మధుకర్రావు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీ రవి, నాయకులు బాల్సింగ్, కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి పాల్గ్గొన్నారు.