‘సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత సెక్రటేరియెట్కు వచ్చాను.. లంకె బిందెలుంటాయనుకున్న.. కానీ ఖాళీ బిందెలున్నయ్.. అని రేవంత్ చెబుతున్నాడు.. లం కె బిందెల కోసం ఎవరు తిరుగుతరో.., రేవంత్ కుటుంబ సభ్యులు ఏం పనిచేస్తారో మీకే బాగా తెలుసు.. గడ్డపారలు, తట్టాబుట్టలు నెత్తిమీద పెట్టుకొని రాత్రిపూట పాడుబడ్డ కోటలల్ల, పాత గడీలల్ల, పాత దేవాలయాల్లో దొంగలు తిరుగుతుంటారు.. మన ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆ పాత బుద్ధులు గుర్తొస్తున్నట్లున్నయ్..’
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అ డ్డిమార్ గుడ్డి దెబ్బ అన్న ట్లు అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని, రే వంత్ గెలుస్తడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిల కూడా నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్, అ చ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఇటుకలు విసిరారని, మనం కూడా ఎన్ని రోజులని ఓపిక పడుతాం.. ప్రజలు కూడా రాళ్లతో కొట్టే రోజులు తొందర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మహబూబ్నగర్లో ఐదారు గెలుస్తం.. పన్నెండు గెలుస్తామని ఎన్నడూ కలగనలేదని, మాక్కూడా కాం గ్రెస్ నేతలు అసెంబ్లీలో చాటుకు చెబుతున్నారన్నారు. ఎ న్నికలకు ముం దు ఇష్టమొచ్చిన వాగ్దానాలు ఇచ్చారని, నేడు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయలేక కుడితిల పడ్డ ఎలుక లెక్క కొట్టుమిట్టాడుతున్నారన్నారు. అప్పుడేమో అందరికీ ఇస్తామని.., ఇప్పుడేమో కొందరికే అంటూ తిర్రి మాటలు చెబుతున్నాడని విమర్శించారు.
రేవంత్రెడ్డి సీఎం లెక్క మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు. ‘ఇప్పటిదాకా రుణం తీసుకున్న రైతన్నలు అర్జెంట్గా బ్యాంకుకు ఉరుకుండ్రి, మాఫీ చేస్తా.. మళ్లీ రూ.2 లక్షలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న సంతకం పెడుతున్నా..’ అ ని రేవంత్ చెప్పాడని.., ఫిబ్రవరి 25 వచ్చే.. ఏమ న్నా జరిగిందా..! ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ఏమన్న అడిగితే రేవంత్కు రోషం పొడుచుకొస్తుంది. అడ్డం మాట్లాడుతాడు’ అని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కరెంట్ బిల్లులు క ట్టకండి, 200 యూనిట్లు ఫ్రీ అన్నడు.. సోనియమ్మ కడుతుందన్నడు.. ఇప్పుడు బిల్లు ఎవరికి పంపాలంటే మేమేమే.. బేబేబే అంటున్నాడన్నా రు. ఏం చెప్పిండ్రు ఏం చేస్తుండ్రని ప్రశ్నించారు. అత్తామామకు.. అవ్వాతాతలకు కూడా రూ.4 వేల పింఛన్, కోడలికి రూ.2,500 ఇస్తమన్నడు.. వాటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు..
వారికి సమాధానం చెప్పాలన్నారు. రూ.500 సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ కోసం 1.24 కోట్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయన్నారు. మళ్లీ ఇప్పుడు నీకు కారుందా, టూ వీలర్ ఉందా.. తెల్ల రేషన్ కార్డు ఉందా..? అంటూ పథకాలను సగం మందికే అందించేందుకు కొర్రీలు పెట్టి అడ్డం పొడుగు మాట్లాడుతున్నరని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. కోపం వచ్చిందో, కాం గ్రెస్ను నమ్మారో.. మహబూబ్నగర్లోని 12 నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యామన్నారు. వందరోజులు ఓపికగా ఉందామని కేసీఆర్ చెప్పారని.. మార్చి 17 వరకు గంభీరంగా ఉందామన్నారు. చేసిన మంచిని మరిచి ముంచేటోళ్లు ఉద్య మ నాయకుడు కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు మా ట్లాడితే ప్రజలు సహించరన్నారు.
చేసిన అభివృద్ధి కండ్లముందు కదలాడుతుండగా.. గవర్నరమ్మ తన ప్రసంగంలో కాంగ్రెస్, రేవంత్ ఇచ్చిన కరపత్రాన్ని చదివి తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి సూద్దామనుకున్నాం.. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు మేం యుద్ధం మొదలు పెట్టాలన్నారు. కాంగ్రెసోళ్లు ఎన్ని పన్నాగాలు పన్నినా ఉద్యమ చరిత్ర కలిగిన బీఆర్ఎస్ దళం మా వైపు ఉన్నదన్నారు. కేసీఆర్, తెలంగాణపై ప్రేమతో ఉన్న కార్యకర్తలు మాకు సైన్యంగా ఉండగా, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలను ఒక్క ఏడాది కాపాడితే నాలుగేండ్లు మనలను కాపాడుతారన్నారు.
కాంగ్రెస్ వచ్చినంక కష్టాలు మొదలైనవని రైతులు బాధపడుతున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు టింగ్ టింగ్మంటూ వారం పదిరోజుల్లోనే రూ.7,600 కోట్ల పైసల్ పడుతుండె అన్నారు. కరెంట్ కోతలు పెరిగినయ్, మంచినీళ్ల లొల్లి షురూ అయ్యింది.. ట్యాంకర్లు కిరాయికి తెచ్చుకొని నీళ్లు తీసుకునే ప రిస్థితి వొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాం గ్రెస్ కష్టాల పాలన బాగుందా అని రైతులు, ప్రజలను కేటీఆర్ అడిగారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చే సినా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనే రాయాల్సి వస్తదన్నారు. ఒకట్రెండు నెలలు కారు సర్వీసుకు పోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన స్పీడ్తో బయటకు తీసి ఉరికిద్దామన్నారు. ఢిల్లీలో ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అనే డూడూ బసవన్నలతో అభివృద్ధి సాధ్యం కా దన్నారు.
నాగర్కర్నూల్లో మర్రి జనార్దన్రెడ్డి అండర్ గ్రౌండ్ చేసిండు, వందల మందికి పెండ్లి ళ్లు చేసిండు, స్కూళ్లు కట్టిండు.. ప్రారంభం మా త్రం మేం చేస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముం దుకొస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్ల మె జార్టీ వచ్చేలా పని చేయాలని కార్యకర్తలకు సూ చించారు. జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తులను రోడ్లపై వేస్తున్నారని మండిపడ్డారు. అడగకముందే తాము అభివృద్ధి చేశామని, కానీ అది ప్రజలకు అర్థం కాలేదన్నారు.
ఇప్పుడు ప్ర జలు అడుగుతున్నా ప్రభు త్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఇంకా పెరుగుతుంది.. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలవాలన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. కాగా, నాగర్కర్నూల్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ దాదాపుగా 40 నిమిషాలు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా రెండు నిమిషాల పాటు కరెంట్ బంద్ అయ్యింది. అంతకుముందు ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా మౌనం పా టించారు.
మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ నుంచి మంజూరైన బీమా చెక్కులను అందజేశారు. అలాగే నాగర్కర్నూల్ ఎంపీగా అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, దళిత నేత జెట్టి ధర్మరాజు కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు నర్సింహాగౌడ్, సత్యం, కల్పన, నాయకులు గోపాల్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ భూపాల్రావు, శ్రీకాంత్భీమా, వెంకటేశ్వర్లబావి మాజీ సర్పంచ్ పద్మ, జెడ్పీటీసీ రాంబాబు, కౌన్సిలర్ మన్నుపటేల్, మాజీ సా ట్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ అరుణ, నాయకులు వెంకటేశ్, గోళి శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నాగం శశిధర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, ఇంతియాజ్ఇసాక్, రజినీసాయిచంద్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలమూరులో గంజి కేంద్రాలు, వలసలను రూపుమాపి ఇతర రాష్ర్టాల నుంచి ఇ క్కడికి వలస వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. నాడు గంజి కేం ద్రాలతో విలవిల్లాడిన పాలమూ రు కొనుగోలు కేంద్రాలతో కళకళలాడింది. ఇవన్నీ గుంపు మేస్త్రీ రేవంత్కి నచ్చడం లేదు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ఆయ న శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించి పా లమూరు మెడపై ఖడ్గం వేలాడదీశాడు. నల్లగొండ సభలో ఈ మో సాన్ని వివరిస్తే తలాతోకా లేకుం డా మాట్లాడుతున్నడు. పాలమూరులో ఓటడిగే నైతిక హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదు. కర్ణాటకలో ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరుకు ఎం దుకు ఇవ్వలేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో చేసిన మోసపూరిత మాటలను ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయాం. ఇప్పుడు కార్యకర్తలు ధైర్యంగా ఉన్నరు.. నాయకులే ధైర్యం తెచ్చుకోవాలి.. కాంగ్రెస్ అడ్డిమార్ గుడ్డిదెబ్బ, గాలివాటంలాగా అధికారంలోకి వచ్చింది. తంతే గారెల బుట్టలో పడ్డారు.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇటుకలు విసిరిండ్రు.. 420 హామీలను అమలు చేయకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందర్లోనే ఉన్నయ్.. పాలమూరు బిడ్డనంటూ చెప్పుకొనే రేవంత్రెడ్డి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి జిల్లావాసుల మెడపై కత్తిని వేలాడదీశాడు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటాలంటే.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా రావాలంటే.. తెలంగాణ హక్కులపై పోరాడాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సిందే.. ప్రస్తుతం కారు సర్వీసింగ్కు పోయింది.. ఏప్రిల్-మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వంద కిలోమీటర్ల స్పీడుతో జైత్రయాత్ర ప్రారంభమవుతుంది’
చేతగాని కాంగ్రెస్ పాలన రెండు నెలల్లోనే తేలిపోయింది. ప్రజా సమస్యలపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యే క రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఘనత గులాబీ సైన్యానిది. తెలంగాణ ఆత్మగౌరవం, భవిష్యత్తు ను కాపాడే శక్తి బీఆర్ఎస్కే ఉన్నది. కాంగ్రెస్ అబద్ధాలకు అసెంబ్లీలో ఎ మ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు నిజానిజాలతో బుల్లెట్లలా సమాధానమిస్తున్నరు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ పబ్బం గడపాలని చూస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చేందుకు గ్యాంరెటీ లేని హామీలిచ్చారు. వాటిని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.
కొన్నాళ్లకే ప్రజలంతా కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్షగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే భయం, అభద్రతాభావం నెలకొన్నది. అక్రమ కేసులకు కార్యకర్తలు, నాయకులు భయపడొద్దు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. గులాబీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో పదేండ్లు అచ్చంపేట అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే పెట్టుకునేందుకు ప్రయత్నించగా, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ అచ్చంపేటకు వచ్చి కాంగ్రెస్ మె డలు వంచి విగ్రహం పెట్టిండు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ప్రభుత్వ జీవో తెచ్చుకున్నాం. 100 పడకలు, 30 పడకల దవాఖాన కట్టించాం. కేఎల్ఐ ద్వారా నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు సాగునీరు తెచ్చాం. కాంగ్రెస్ తటాకుచప్పుళ్లకు భయపడం.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాం.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు
ఎన్నికల్లో గెలుపు ఓటములు స హజం. పది సంవత్సరాలుగా చేసిన పనుల్లో ఎక్కడైనా తప్పు చేస్తే సరిద్దడానికి ఇప్పుడు అవకాశం ఉం టుంది. ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం.. మనది ఉద్యమ పార్టీ. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చే యడానికి నాయకులు, కార్యకర్తలు ఉద్యమస్ఫూర్తితో పోరాడాలి. కార్యకర్తలకు అన్యాయం జరిగితే గెలిచే ఎంపీ అండగా ఉంటారు.. పార్టీ ఎం పీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా గెలిపించుకోవాలి. రాబోయే రోజుల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్లో గులాబీ పార్టీ గెలవాలి. అసెంబ్లీలో వచ్చిన ఓట్లకన్నా నాగర్కర్నూల్లో అత్యధిక ఓట్లు వచ్చేలా పని చేయాలి.
మనలోనూ మార్పు రా వాలి. కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలంటే గులా బీ జెండా ఎగరాలి. నియోజకవర్గానికి రాక రెండు నెలలు అయ్యింది. నేను ఎన్నికల్లో గెలుస్తానన్న ప్రచారం, ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది. నేనూ అదే నమ్మాను. రాజు కథలాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం కానీయొద్దు. కార్యకర్తలను కొద్దిగా విస్మరించిన మాట ని జం. రెండు నెలల్లోనే గులాబీ జెండాను పక్కన పెట్టి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారు. చేయాల్సినదానికన్నా ఎక్కువ అభివృద్ధి చే శాం. అసెంబ్లీ ఎన్నికలకు మూడింతలు అధికంగా పని చేయాలి.
-మర్రి జనార్దన్రెఢ్డి, మాజీ ఎమ్మెల్యే