జడ్చర్ల, డిసెంబర్ 29 : వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రై తన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం బాదేపల్లిలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. చైర్మన్ మన్నెం గోవర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్అలీ దానిష్తోపాటు డైరెక్టర్లు కాడయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, ప్రదీప్, సుభాన్అలీ, వీరారెడ్డి, కొం గళి నాగరాజు, భానుప్రకాశ్, వినోద్కుమార్, వెంకటేశ్వర్రెడ్డి, రామవతార్ ఝవార్తో మార్కెటింగ్శాఖ డీ ఎంవో సారిక ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోనే పెద్ద మార్కెట్గా గుర్తింపు పొందిందన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా పంట పెట్టబడికి సీఎం కేసీఆర్ రైతుబంధును అమలు చేస్తున్నారని తెలిపారు. ఎకరాకూ రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి సీజన్లకు రూ.10 వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ యాసంగికి పెట్టుబడి సాయం పం పిణీ మొదలైందన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు వ్యవసాయం పండుగలా సాగుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొన్నామని తెలిపారు. దళితబంధు ల బ్ధిదారులు ఆర్థికంగా నిలబడేలా చేసిందన్నారు. దేశ ప్ర జలకు అండగా ఉండేందుకే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ను కావాలనుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాపారులు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భారీ బైక్ ర్యాలీ..
పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డికి పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎ మ్మెల్యే ట్రాక్టర్ నడుపుతూ మార్కెట్ యార్డుకు చేరగా.. బైక్ ర్యాలీ ఆయనను అనుసరించింది. పట్టణం గులాబీమయంగా మారింది.
కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, వాల్యానాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, రాష్ట్ర సం గీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు శోభాగోవర్ధన్రెడ్డి, లక్ష్మయ్య, మురళి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, సర్పంచులు ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, నర్సింహులు, కౌ న్సిలర్లు లత, చైతన్య, సారిక, ముడా డైరెక్టర్లు ఇమ్మూ, శ్రీకాంత్, నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.