కొడంగల్, నవంబర్ 1: ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే అని..తెలంగాణను మరింత అభివృద్ధి చేసేది సీఎం కేసీఆర్ సారేనని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పాయిపల్లి, ఉడిమేశ్వరం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్తో కన్నీళ్లు తప్పవన్నారు. కర్ణాటకలో కరెంటు, తాగునీళ్లు, సాగునీళ్లు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ను ఎందుకు గెలిపించుకున్నామని బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా..? 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఓసారి ఆలోచించు కోవాలన్నారు. 2018కు ముందు కొడంగల్ నియోజకవర్గం అన్నింటా వెనుకబడి ఉండేదని, ఆనాడు ఎన్నికల ప్రచారంలో గ్రామాలను చూసి చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. దాంతో సీఎం కేసీఆర్కు నియోజకవర్గ పరిస్థితిని వివరించి ప్రత్యేకంగా రూ.కోట్లాది నిధులను మం జూరు చేయించినట్లు తెలిపారు. నేడు గ్రామ గ్రామానికీ బీటీ, సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ, జూనియర్ కళాశాలలను మంజూరు చేయించడంతో పాటు, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏనాడూ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజాభ్యున్నతికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కేసీఆర్ సార్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మ్యానిఫెస్టోలోని ప్రతి సంక్షేమాన్నీ అందుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
బొంరాస్పేట, నవంబర్ 1: వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తే ప్రజల కష్టసుఖాల్లో ఉంటామని, అభివృద్ధికి పాటుపడుతామని ఎమ్మెల్యే తనయుడు పట్నం హితీష్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మహేందర్ అన్నారు. బుధవారం మండలంలోని మహాంతిపూర్, కొత్తూరు, వడిచెర్ల, లింగన్పల్లి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఐదేండ్లలో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కోట్ల రూపాయలతో మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత హామీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సలాం, సుభాన్రెడ్డి, రాజూగౌడ్ పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రెండోసారి నరేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. మండలంలోని తుంకిమెట్లలో ఎంపీటీసీ తిరుపతయ్య, బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ జలీల్ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.