జడ్చర్ల, మార్చి 6 : ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రు నాయకులు మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద నామినల్ ఫీజు కట్టాలని చెప్పిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని, ప్రజలమీద భారం మోపరాదని, తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దుచేస్తామని ప్రకటించారన్నారు.
తీరా అధికారంలోకి వచ్చాక డబ్బులు కట్టమని చె ప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారం లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం వారికే చెల్లిందన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితం చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు లత, చైతన్య, దేవ, సతీశ్, జ్యోతి, రఘురాంగౌడ్, ముడా మాజీ డైరెక్టర్లు రవిశంకర్, ఇంతియాజ్ఖాన్, నాయకులు రాజేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, మురళి, నర్సింహులు, కృష్ణారెడ్డి, హఫీజ్, శ్రీను, శంకర్నాయక్, శ్రీనివాస్యాదవ్, పర్మటయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.