దోమ నవంబర్ 3: మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన అభివృద్ధిని గుర్తించి విలువైన ఓటును వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
కులకచర్ల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి మహేశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పీరంపల్లి గ్రామంలో మండల రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, నాయకులు సోమలింగం, కామునిపల్లిలో సర్పంచ్ మహిపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ బాలయ్య ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే చౌడాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ్ట ఎమ్మెల్యే అభ్యర్ధి కొప్పుల మహేశ్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అడవివెంకటాపూర్లో మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు
దౌల్తాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్ ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. శుక్రవారం దౌల్తాబాద్, చెల్లాపూర్, దేవర్ఫస్లవాద్, సుల్తాన్పూర్, లొట్టికుంటతండా,నంద్యాతండా, బాలంపేట తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాండునాయక్,మంజూలాల్ నాయక్, రవి, సూరి,వెంకట్, రమేశ్, బీములు, అంజి తదితరులు పాల్గొన్నారు.
గండీడ్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటితో విజయం సాధిస్తుందని ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వెన్నాచేడ్, పెద్దవార్వల్, సల్కర్పేట్, రంగారెడ్డిపల్లి, అంచన్పల్లి, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ రేణుక, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, రైతుబంధు సమితి మండల అద్యక్షుడు గోపాల్, నాయకులు, రాంరెడ్డి, దశరథ్, కృష్ణయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్: యావత్ ప్రజానీకం బీఆర్ఎస్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిక్షపతి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దేశాయిపల్లి, నంచర్ల గ్రామా ల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో దేశాయిపల్లి సర్పంచు రాఘవేందర్, నాయకులు గోపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, అంజిలయ్య ఆయా గ్రామాల సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.