జడ్చర్ల/జడ్చర్లటౌన్, అక్టోబర్ 27 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్రవారం మున్సిపాలిటీలోని 24వ వార్డులో పద్మావతికాలనీ, తాలూకా క్లబ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొ న్న అంశాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కనివిని ఎరుగని రీతిలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మున్సిపాలిటీలో ని 24వ వార్డులో 90శాతం అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు చేరుతున్నాయన్నారు. నియోజకవర్గం, పట్టణం మరిం త అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అందుతాయని వివరించి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు అందించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సూర్యప్రకాశ్రెడ్డి, రమేశ్గౌడ్, కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మిడ్జిల్, అక్టోబర్ 27 : బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్ అ న్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధు లు నాలుగు టీమ్లుగా ఏర్పడి గ్రామాల్లో ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. మండలంలోని వాడ్యాల్, దోనూర్, కొ త్తపల్లి, వెలుగొమ్ముల తదితర గ్రామాల్లో జోరుగా ప్రచారం చేశారు. పని చేసే బీఆర్ఎస్ పార్టీ వెంట ప్రజలు ఉండాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శ్యామ్సుందర్రెడ్డి, నాయకులు శ్రీనివాసులుగుప్తా, జైపాల్రెడ్డి, రవికుమార్, శ్రీనివాసులు, ఎల్లయ్యయాదవ్, శివప్రసాద్, వెంకట్సాగర్, కాడయ్య, సుకుమా ర్, భిక్షపతి, బుచ్చయ్య, చంద్రయ్య, భీమ్రాజు, వెంకట య్య, నవీనాచారి, ఉదయ్కుమార్, అయ్యప్ప, నర్సింహ, రాము, నాగరాజు, కుమార్, శివ, రాజు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 27 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మండలంలోని గౌతాపూర్లో సర్పంచ్ రమేశ్తో కలిసి శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, రమేశ్, ప్రకాశ్గౌడ్, శ్రీశైలం, లింగం, యాదిలాల్, నర్సింహ, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఊర్కొండ, అక్టోబర్ 27 : మండల కేంద్రంతోపాటు మండల పరిధిలో ఇప్పాపహాడ్, నర్సంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని బారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బారీ మెజార్టీతో గెలువాలని పబ్బాతి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్రెడ్డి, గిరి నాయక్, వీరారెడ్డి, గోపాల్గుప్తా, నాయకులు పాల్గొన్నారు.
నవాబ్పేట, అక్టోబర్ 27 : మండలంలోని వివిధ గ్రా మాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన ప్రచారం ఊపందుకున్నది. శుక్రవారం మండలంలోని నవాబ్పేట, యన్మన్గండ్ల, హ జిలాపూర్, రుద్రారం, కాకర్జాలతండా, తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డిని భా రీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహు లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ శీన య్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచులు గోపాల్గౌడ్, జయమ్మ, హన్మంతు, గంగ మ్మ వెంకటేశ్, లలితమ్మ, యూత్వింగ్ మండలాధ్యక్షుడు శ్రీను, నాయకులు వినోద్రావు, కృష్ణగౌడ్, బాలకిష్టయ్య, చెన్నయ్య, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
హన్వాడ, అక్టోబర్ 27 : మహబూబ్నగర్ నియోజకవర్గం లోని హన్వాడ మండలం మునిమోక్షం, కొత్తపేట, హన్వా డ, ఇబ్రహీంబాద్, షేక్పల్లి గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి కారు గు ర్తుకు ఓటు వేసి మంత్రి శ్రీనివాస్గౌడ్ను గెలిపించాలని శు క్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేశా రు. కార్యక్రమంలో చెన్నయ్య, జంబులయ్య, అంజన్న, రా ఘవులు, పాపయ్య, శ్రీనివాసులు, యాదయ్య, వెంకటయ్య, ఆంజనేయులు, బాలకిష్టయ్య, వెంకటేశ్ ఉన్నారు.