మక్తల్ టౌన్, నవంబర్ 10 : నియోజకవర్గంలోని మాదాసి, మాదారి కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శు క్రవారం ఎమ్మెల్యే తన స్వ గృహంలో మక్తల్, కృష్ణ మండ లాలకు చెందిన మాదాసి, మా దారి కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మా ట్లాడారు. కురుమ సోదరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డి వారి సమస్యల పరిషారానికి నిరంతరం పనిచేస్తున్నానని తెలి పారు.
కులవృత్తిదారులకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కల్పించి అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలో ప్రతిఒకరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నారన్నారు. సమావేశంలో మాదాసి, మాదారి నాయకులు హనుమంతు, ఎల్లలింగ, నాగరాజు, యుగేందర్, రంగప్ప, గజలప్ప, కుర్మయ్య, బీరప్ప, హనుమంతు, మారెప్ప, ఎల్లప్ప, కృష్ణ, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, రాజు ఆశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.