మక్తల్ టౌన్, మార్చి 25 : ఉమ్మడి పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాడు కరెంట్ కష్టాలతో సతమతమైన చో ట.. స్వరాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నా రు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి అ ధ్యక్షతన మండలకేంద్రంలోని ద్వారక గార్డెన్లో పార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యే చిట్టెం సతీమ ణి సుచరితారెడ్డి ఆత్మీయ సమ్మేళనం సారాంశాన్ని కార్యకర్తలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ కశిరెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సాగు, తాగునీరు, కరెంట్ కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. నిరంతర ఉచిత విద్యుత్ను అందిస్తున్నారన్నారు. కేవలం ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా మా ర్చారన్నారు. రూ.10 లక్షలు అందజేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,100 యూనిట్లకు దళితబంధును అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై విషం కక్కుతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోగా జాతీయహోదాను సైతం విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలను శాశించనున్నదన్న భయంతోనే రాష్ట్ర అభివృద్ధిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నదన్నారు. కార్యకర్తలంతా కుటుంబంలా కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చిట్టెం రామ్మోహన్రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ ప్రజలకు సొంతిం టి కల నెరవేర్చాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లకు ఏప్రిల్లో గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. దగ్గరుండి లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎం పిక చేస్తామన్నారు. దేశంలోని ప్రతి రాష్ర్టాన్ని ఒకేలా చూడాల్సిన కేంద్రం.. తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఈడీ, సీబీఐలను పావుల్లా వాడుకుంటున్నదన్నారు. అమిత్షాను గతంలో గుజరాత్ రాష్ట్రం నుంచి తడిబార్ (వెలివేయడం) చేశారని.. అలాంటి వ్యక్తి నేడు హోం శాఖ మంత్రి పదవిలో ఉండి దేశ సంపదను అక్రమార్కుల చేతిలో పెడుతున్నారన్నారు.
నల్ల చట్టాలను అమలుచేయాలని చూసి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారన్నారు. వీటన్నింటినీ నియంత్రించి దేశ ప్రజలకు సుస్థిరమైన పాలనను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, టీపీసీ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, ఎంపీపీ వనజ, మాజీ ఎంపీపీలు హన్మం తు, చంద్రకాంత్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, అమరేందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.