మహబూబ్నగర్, మార్చి 11 : కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దేశంలో ఏ పార్టీకీ లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, ప్రశ్నించే గొంతుకకు మద్దతివ్వాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హా ల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, శాసనమండలి అభ్యర్థి నవీన్కుమార్రెడ్డితో కలిసి మాజీ మంత్రి హాజరై మాట్లాడారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొని అందరి మన్ననలు పొందామన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎవరినీ నొప్పించే వ్యక్తి కాదన్నారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించాల్సిన బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. ఎంపీ గెలిస్తే అం దరం గెలిచినట్టేనని, మన సమస్యలను ఢిల్లీలో వినిపించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి పరిష్కరించుకోవచ్చన్నారు. గడిచిన పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అక్కున చేర్చుకొని ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నదన్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందించామన్నారు. కొందరు కేవలం వ్యక్తి కోసం ఆలోచిస్తూ వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారన్నారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మీ సమస్యలు అన్నీ తెలిసిన మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీ వైస్చైర్మన్ నవీన్కుమార్రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు. 1,400 మంది సభ్యుల్లో 900 మంది బీఆర్ఎస్ వాళ్లేనని, వారంతా మన అభ్యర్థికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి భారీ మె జార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మన గె లుపు రాష్ట్రంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నా రు. కాంగ్రెసోళ్లు పార్లమెంట్ ఎన్నికల కోసం అది చే స్తాం.. ఇది చేస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తమ లక్ష్యమని, అందుకు సభ్యులు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరారు. కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేల్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై కాలయాపన చేస్తూ కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం అది ప్రారంభిస్తున్నాం.. ఇది ప్రారంభిస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారమేనని, ఎంపీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఉరుకులాట ముగుస్తుందన్నారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సభ్యులు అంద రూ ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ప్రజలకు మంచి చేయడం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ. నర్సింహు లు, కౌన్సిలర్ రవికిషన్రెడ్డి, నేతలు రాజేశ్వర్గౌడ్, గో పాల్యాదవ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నేను గతంలో ఉమ్మ డి జిల్లా జెడ్పీ వైస్చైర్మన్గా బాధ్యతలు చేపట్టాను. ఇక్కడి ప్రజల ఇ బ్బందులు నాకు తెలు సు. నన్ను ఆదరిస్తే మ రింత అభివృద్ధికి కృషి చేస్తా. బీఆర్ఎస్ అధినే త కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అభ్యర్థుల సహకారంతో శాసనమండలి అభ్యర్థిగా నాకు అవకా శం ఇచ్చారు. అందరూ పూర్తిస్థాయిలో మద్ద తు తెలపాలి.
ప్రజలకు అందుబాటులో ఉంటూ 7 నియోజకవర్గాల స మస్యలను పార్లమెంట్లో వినిపించాను. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కరిని కూడా బాధపెట్టలేదు. అందరితో కలిసి ముం దుకు సాగడమే తన ధ్యేయం. చేతనైనంత సాయం చేస్తా. కేసీఆర్ చూపిన మార్గంలోనే నా ప్రయాణం ఉంటుంది. ప్రతిఒక్కరూ నిండు మనస్సుతో మద్దతు తెలపాలి. ఎ వరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి చేయమంటే ఏవేవో ప్రారంభాలు చే సుకుంటూ పోతున్నది. సీఎం రేవంత్రెడ్డి ప్రచారాలకు మాత్ర మే ప్రాధాన్యతనిస్తూ ప్రజా స మస్యలను గాలికొదిలేస్తున్నా రు. ఇప్పటికీ కొందరు నాకు ఎ మ్మెల్యే గారు అంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అ ర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు పు ట్టి.. బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రెట్టింపు ఉత్సాహంతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ప్రజలకు అమలు కాని హామీ లు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం ది. కొంతమంది చేసిన తప్పుల తో తాము అధికారంలోకి రా లేదు. మున్ముందు ఎవరూ ఊ హించని స్థాయిలో అధికారంలోకి రావడం ఖాయం. ఇన్కంట్యాక్స్ చెల్లిస్తే రైతుబం ధు ఇవ్వం.., సిలిండర్ ఇవ్వమంటూ ప్రజలను ఇ బ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు ఉన్నది.
బీఆర్ఎస్ అభ్యర్థులైన నవీన్ కుమార్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సీఎం చెబుతున్నడు, మో దీ భవిష్యత్తులోనూ తానే పీఎంనంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు అవసరాలను బట్టి రాజకీయాలు చేస్తున్నాయి.
ఎంతో శ్రమించి రాష్ర్టాన్ని సుభిక్షంగా చేసుకున్నాం. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి అభివృద్ధిని గాలికొదిలేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడికి వెళ్లి నా అభివృద్ధి కనిపించగా.. ప్ర స్తుతం ఎండిన పంటలే కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నా యకులను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది.