వంగూరు, ఏప్రిల్ 14 : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగా తెలంగాణ అ స్థిత్వం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఎం పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఆదివారం వంగూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముందే రాజ్యాంగాన్ని మార్చే ముసాయిదాను బీజేపీ సర్కా రు తయారు చేసిందని, దానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మద్దతు పలుకుతున్నారన్నారు. 370 మంది ఎంపీలు గెలిస్తే తప్పకుండా ప్ర ధాని మోదీ రాజ్యాంగాన్ని మా రుస్తారన్నారు. రాహుల్గాంధీ బీజేపీని విమర్శిస్తుంటే రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి బీజేపీకి వ త్తాసు పలుకడం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నా రు.
బీజేపీ, కాంగ్రెస్ రెండూ వేరు కాదని, ఇద్దరు కలిసి తెలంగాణను దోచుకునే పనిలో నిమగ్నమయ్యారన్నారు. ఆరు గ్యారెంటీలలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు రోజుకో స్కాం పేరుతో సీఎం రేవంత్ లీకులిస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డా రు. నాగర్కర్నూల్ ఎంపీగా రెండు పర్యాయాలు పనిచేసిన కాంగ్రెస్ అభ్య ర్థి మల్లు రవి నియోజకవర్గ అభివృ ద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. ఎంపీ రాములు 220రోజులు పార్లమెంట్కు హాజరై కేవలం ప్రశ్నలు మాత్రమే సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావే శంలో బీఆర్ఎస్ అచ్చంపేట ఇన్చార్జి నవీన్రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గణేశ్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లయ్యయాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు జైపాల్రెడ్డి, ప్రశాంత్రా వు, అంజి, రాజు, సైదులు, జంగయ్య, సాయిలు తదితరులు ఉన్నారు.
అచ్చంపేట, ఏప్రిల్ 14 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం ఉప్పునుంతలలో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల స న్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి గువ్వల మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో మార్పు అన్నారు కానీ, కాంగ్రెస్ నాయకులు ఇసుక అక్రమ దందా, అక్రమ మై నింగ్ దందాగా, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ప్రజలు ఇలాంటి మార్పు ను కోరుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన వందరోజులు దాటినా నేటికీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలంగాణలోని గురుకుల విద్యార్థులకు మంచి విద్యను అందించారని, ప్రజల బాధ తెలిసిన నాయకుడిగా మన ముం దుకు వస్తున్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని పి లుపునిచ్చారు. అనంతరం ప్రవీణ్కుమార్ మాట్లాడు తూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చే శారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి, నాగర్కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడియా సమన్వయకర్త అభిలాష్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొత్త రవీందర్రా వు, సింగిల్ విండో చైర్మన్ సత్తు భూపాల్రావు, నాయకులు కట్టా గోపాల్రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.