మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా జడ్చర్లలోని దేవి థియేటర్లో గాంధీ సినిమాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సినిమాను తిలకించారు.