ధన్వాడ, జూన్ 1 : అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడేండ్ల నుంచి బీడీ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో రాధిక, కవిత, వెంకటేశ్, భాగ్యలక్ష్మి, సంధ్య, మంజుల, సత్యమ్మ, వెంకటమ్మ, బేగం, సత్యమ్మ, ఫాతిమ, సుజాత తదితరులు పాల్గొన్నారు.