భూత్పూర్: కమిటీలలో పదవులు రానంత మాత్రన కార్యకర్తలు నిరాశపడొద్దని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి నివాసంలో భూత్పూర్, మధనపురం మండలాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమ శిక్షణతో మెలగాలని, ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేర వేయాలని ఆయన కోరారు.
గతంలో తాను జడ్పీటీసీగా ఉన్న సమయంలో అత్యవసరమైన పరిస్థితుల్లో కప్పెట, రావులపల్లి గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు మరమ్మతు కోసం రూ. లక్ష మంజూరు చేయాలంటే 4సంవత్సరాల కాలంలో చేయాలేక పోయానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు కావాలంటే అక్కడ లక్షల్లోనే నిధులు మంజూరవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడమేనని తెలిపారు. నియోజకవర్గంలో అందరి కళ్లు భూత్పూర్ మండలం పైనే ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. భూత్పూర్ మండలం ఎప్పుడూ నా నమ్మకాన్ని వమ్ము చేయలేడు. ఎన్నికలు ఏవైనా మెజార్టీ అంతకంతకు పెరిగిందని ఆయన తెలిపారు.
భూత్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఉపాధ్యక్షుడిగా సాయిలు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్రెడ్డి, మండల యువత అధ్యక్షుడుగా ముడావత్ బాలకోటీ, ఉపాధ్యక్షుడుగా గడ్డం ప్రేమ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాము, ఎస్సీ కమిటీ అధ్యక్షుడు బోరింగ్నర్సిములు, ఎస్టీ కమిటీ అధ్యక్షుడు శంకర్నాయక్, మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మహమూద్, ఉపాధ్యక్షుడు జహంగీర్, ప్రధాన కార్యదర్శి రఫీవుల్లా, ప్రచార కార్యదర్శి బాబా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కదిరెశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, సింగిల్ విండో చైర్మన్ అశోక్రెడ్డి, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, నాయకులు సత్యనారాయణ, గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్, వివిధ గ్రామాల కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.