కొల్లాపూర్, డిసెంబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్, పద్మతో పాటు 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దమారు గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకులు సైతం మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులకు ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అలవికానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజల ముందు ఉంచాలన్నారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో చిన్నబావి మండలం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.