జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఆశావర్కర్లకు ( ASHA Workers ) కనీస వేతనం ( Minimum Wage) రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు.
గద్వాల ఎంఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటాలు ఆపబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా వర్కర్ల వేతనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఆశ వర్కర్లు మక్తల్ జాతీయ రహదారి 167 పై ధర్నా నిర్వహించారు. దాదాపు గంటపాటు నిర్వహించిన ధర్నా వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.