కౌకుంట్ల( చిన్న చింతకుంట), జూలై 16 : కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
గురువారం చిన్న చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామంలో బండర్పల్లి, పల్లమర్రి, లాల్ కోట, గోప్యానాయక్తండా, ఫర్దీపూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ముఖ్యంగా సర్తోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశంతో చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.