వనపర్తి, ఆగస్టు 25 : తెలంగాణలోని ప్రజలందరూ బాగుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉన్నంతలో అందరికీ సహకరిస్తూ ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 361మంది దివ్యాంగులకు రూ 4,016 పింఛ న్ ప్రొసీడింగ్లు, 395 మందికి కుల వృత్తులకు సంబంధించిన రూ.లక్ష చెక్కులను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 11వేల మంది దివ్యాంగులకు పింఛన్లను ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా కులవృత్తులకు రూ.లక్ష చెక్కును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఆధునికత సాంకేతికత రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయని అలాంటి వృత్తిని నమ్ముకొన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటే వారు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందిస్తున్నారని చెప్పారు.
సామాన్యులకు అండగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని పేదవాడు అయితే చాలు దానిని పరిగణలోకి తీసుకుని పథకాలను ఇస్తున్నామని ఆ కోవలోనే బీసీబంధు సైతం అమ లు చేస్తామని, దశల వారీగా ఈ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడంతో ఆ రంగంతోపాటు అనుబంధ రంగాల వారికి ఉపాధి దొరుకుతుందని, గ్రామాల నుంచి వలసలు పూర్తి స్థాయి లో ఆగిపోయి తెలంగాణలోని గ్రామాలకు వ్యవసాయ పనులకు కూలీలుగా ఇతర రాష్ట్రాల వారు వలసలు వస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఒకప్పుడు వనపర్తిలో గతంలో రెండు మూడు బంగారు దుకాణాలు ఉం డేవి, కానీ నేడు వెయ్యికిపైగా బంగారు దుకాణాలు, 50 వరకు బిర్యాని సెంటర్లు ఏర్పాటయ్యాయని, కార్ల షో రూంలు, బైక్ షో రూంలు, సూపర్మార్కెట్లు రాకతో వే ల మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందన్నారు. సమాజం లో వెనుకబడ్డ వారికి కార్పొరేషన్ల ద్వారా చేయూతనిస్తామని, పనిచేసిన ప్రభుత్వానికి ప్రజలు చేయూతనందించి అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
చప్పట్లతో ప్రభుత్వానికి ఆశ్వీర్వాదం
మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రభుత్వం మనం అందరం బాగుండాలి అనుకునే వారందరూ ఒక్క నిమి షం పాటు చప్పట్లు కొట్టాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించడంతో 756మంది లబ్ధిదారులు, సహాయకులు, నాయకులు నిమిషంపాటు చప్పట్లతో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆశ్వీరాదాన్ని తెలిపారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం తరుపున సంక్షేమ పథకాలను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అ న్నారు. జిల్లా వ్యాప్తంగా 11,360 మంది దివ్యాంగుల కు రూ 3,016 నుంచి రూ 4,016 పెంచుతూ ప్రభు త్వం తరుఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం నుంచి దళితబంధు, మైనార్టీ, బీసీ బంధు వంటి పథకాలను పొందిన లబ్ధిదారులకు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అనంతరం లబ్ధిదారుల కు మంత్రి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజావరప్రసాద్రావు, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిథి వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డితోపాటు వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.