ఖిల్లాఘణపురం, ఆగస్టు 22 : పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు మంత్రి నిరంజన్రెడ్డి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి పంపిణీ చేశారు. ముందుగా నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను మంత్రి నిరంజన్రెడ్డికి ఇవ్వడంపై ఆయనకు గ్రామాల్లోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణా లు చేపట్టినట్లు చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 80 వేల కుటుంబాల్లో 70 వేల కుటుంబాలకు ఇండ్లు ఉన్నాయని, కేవలం 10వేల ఇండ్లు మాత్రమే ని యోజకవర్గంలో ఇండ్లు అవసరమున్నప్పటికీ ఇప్పటికే 3,225 ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చార ని, ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 4వేల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రధానంగా ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 అందించి ఆదుకుంటున్నారన్నారు. అదేవిధంగా రైతుల కోసం సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి పథకాలు తీసుకువచ్చారని వివరించారు. సోలీపూర్ గ్రామానికి రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందని ఈ గ్రామంలో గతంలో చూసినప్పుడు పూరి గుడిసెలు, పెంకుటిండ్లు, రేకుల షెడ్లు ఉండేవని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలతో గ్రామ రూపురేఖలు మారిపోయాయన్నారు. ఈ గ్రామం జాతీయస్థాయిలో అవార్డు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
అనంతరం సోలీపూర్ గ్రామంలో యాద వ కమ్యునిటీహాల్, ఆముదంబండతండాలో ఎస్టీ క మ్యూనిటీహాల్, గట్టుకాడిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం, కమాలుద్దీన్పూర్లో ఆరోగ్య ఉపకేం ద్రం, గౌడ , శాలివాహన కమ్యూనిటీహాల్, మండల కేంద్రంలో ఆర్య కమ్యూనిటీ హాల్, ఆరోగ్య ఉపకేంద్రం, సమీకృత మార్కెట్ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి ప్రా రంభించారు. అదేవిధంగా తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయిపాపన్న విగ్ర హ ఏర్పాటు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, రాష్ట్ర ఆయిల్పాం డైరెక్టర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, వైస్చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షుడు విక్రమ్, మార్కెట్ డైరెక్టర్ శ్యాం సుందర్రెడ్డి, సత్యంతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.