ఊట్కూర్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ( PRC ) ని ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను ఒకేసారి విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ ( PRTU ) నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్రెడ్డి ( Janardhan Reddy ) డిమాండ్ చేశారు. గురువారం పీఆర్టీయూటీఎస్ ఊట్కూర్ మండల శాఖ అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి కే. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు పలు పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయాలని, పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. హెల్త్ కార్డులపై అపోహలు అవసరం లేదని, ట్రస్ట్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి మాధవి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కుసుమ, మండల గౌరవ అధ్యక్షుడు ఫజల్, జిల్లా నాయకులు భాస్కర్, వెంకటేష్ గౌడ్, ఆనంద్, సాయప్ప, మహేష్, రాములు, అబ్దుల్ సలాం, ఆంజనేయులు, గురునాథ్, పద్మావతి, నారాయణ, రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.